- Advertisement -
వెస్టీండీస్. పొట్టి క్రికెట్ లో రారాజులు. అటు మహిళల జట్టు.. ఇటు పురుషుల జట్టు కూడా రెండు కప్ లు సాధించి తామేంటో క్రికెట్ ప్రపంచానికి చెప్పాయి. కప్ గెలిచిన ఆనందంలో చొక్కుల విప్పి కాసింత అతిగా ప్రవర్తించినా.. తమలో మానవత్వం ఎంతో ఉందని చాటారు విండీస్ ఆటగాళ్లు.
తమ జీతాల విషయంలో బోర్డుతో ఎన్ని వివాదాలున్నా.. జీతాలు చాలడం లేదు మహా ప్రభో అని వీరు మెరపెట్టుకుంటున్నా.. వాటిని పక్కన పెట్టి ప్రపంచకప్ ద్వారా వచ్చిన ప్రైజ్ మనీలో కొంత మొత్తాన్ని కోల్ కతాలోని మదర్ థెరిసా ఫౌండేషన్ కు డొనేషన్ గా ఇచ్చారు. వెస్టీండీస్ జట్టు మేనేజర్ రాల్ లెవిస్ ఈ చెక్కును మదర్ థెరిసా ఫౌండేషన్ కు అందచేసారు.