ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లా చిత్తూరు మీద దృష్టి పెట్టారు. చిత్తూరు లో వైకాపా తరఫున చెవిరెడ్డి తనకి బాగా అడ్డుగా ఉన్నాడు అని బాబు గట్టిగానే ఫిక్స్ అయ్యారు. అతని వలన జనాలు రోడ్డు మీదకి వచ్చి తమ ప్రభుత్వానికి ఎదురుగా నిరసనలు, ఆందోళనలూ చెయ్యడం బాబు కి నచ్చలేదు. ఆ ఎమ్మల్యే న్ని ఇప్పటికే చంద్రబాబు మూడు చెరువుల నీళ్ళు తాగించాగా అతను ఏకాక్డా తగ్గట్లేదు.
సొంత ఇలాకాలో అతడి నస భరించలేనంత దారుణంగా ఉంది. అందుకే పలుమార్లు అరెస్టుల ఫర్వంతో చెవిరెడ్డిని బెంబేలెత్తించాడు బాబు. అయితే బాబు ఇలా కావాలనే టార్గెట్ చేయడం వైకాపాలో చర్చకొచ్చింది.ఓ కేసు విషయంలో బెయిల తీసుకున్న చెవిరెడ్డి జైలు గడప దాటగానే మరో కేసులో ఇరికించారు పోలీసులు. ఇదంతా ముందస్తు ప్లాన్ అని ఆరోపించారు వైకాపా నేతలు. ‘
2015లో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి 10 జిల్లాల్లో ఏదో రూపంలో ఆందోళనలతో అట్టుడికించారు. ప్రజా సమస్యలు తనవిగా చేసుకుని పోరాడారు. దాంతో వారంలో కనీసం మూడు నాలుగు సార్టయినా కోర్టుల, జైళ్లు అంటూ తిరగాల్సొచ్చింది.