Thursday, May 9, 2024
- Advertisement -

కొత్త‌ ఇళ్లు అదిరంద‌య్య చంద్రం…

- Advertisement -
Chandrababu New Home

ఏపీ సీఎం నారాచంద్ర బాబు నాయుడు త‌న కొత్త ఇంటిలోకి అడుగుపెట్టాడు. హైద‌రాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నెంబ‌ర్ 65లో అతి విలాస‌వంత‌మైన‌,రాజ‌భ‌వనాన్ని త‌ల‌పించే విధంగా  నిర్మించిన ఇంట్లో గుట్టు చ‌ప్పుడు కాకుండా నూత‌న గృహ‌ప్ర‌వేశం చేశారు. 2,479 గజాల విస్తీర్ణంలో నిర్మించిన చంద్రబాబు నూతన గృహంలో నిర్మాణాలు, కళాఖండాలు, ఇంటీరియర్లన్నీ కళ్లు చెదిరే విదంగా ఉండంటో చూసినోల్లు అవాక్క‌య్యారు. ఇంటిలోప‌ల విశాల వంత‌మైన  కాన్ఫరెన్స్‌ హాళ్లు, లైబ్రరరీ, వీఐపీ లాంజీలు, భోజనశాలలు, టెర్రస్‌పై అరుదైన విదేశీజాతి మొక్కలతో రూపొందించిన పచ్చికబయలు ఆకర్షణీయంగా  ఇంటిని నిర్మించారు.

ఇంటి లోపల వినియోగించిన పరికరాలన్నీ ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి కావటంతో భవనం ఇంధ్రభవనాన్నిత‌ల‌పించే విధంగా అత్యంత ఆక‌ర్శ‌నీయంగా నిర్మించారు. ఇక చంద్ర‌బాబు నాయుడు విష‌యానికొస్తే ఎప్పుడూ పేద‌ముఖ్య‌మంత్రినినే ప‌దేప‌దే డ‌ప్పాలుకొట్ట‌డం లో చంద్ర‌బాబుకు సాటిమ‌రెవ‌రూ రారు.రాజ‌కీయాల్లో నాఅంత నిజాయితీ ప‌రుడు ఎవ‌రూలేర‌నీ నిత్యం ప‌దేప‌దే ఊద‌ర‌గొడ్తుంటారు.ఇక పాలు,కూర‌గాయ‌ల‌తో జీవ‌నం కొన‌సాగిస్తున్నామ‌నీ ఇంత‌టి వాడిని అయ్యాన‌నీ చెప్పుకొనే చంద్ర‌బాబు ఇంత విలాస‌వంత‌మైన ఇంటిని  నిర్మించ‌డంతో  అంద‌రూ ముక్కుమీద వేల‌సుకొనేంత ప‌న‌య్యింది.ఇంటి నిర్మానం ఖ‌ర్చు విష‌యానికి వ‌స్తే చంద్ర‌బాబు అండ్ కో నోరు విప్ప‌డంలేదు.ఎంత లేద‌న్నా 100కోట్ల‌కుపైగా ఇంటిఖ‌ర్చు అయిన‌ట్లు  వివ్వ‌నీయ వ‌ర్గాల స‌మాచారం.పేద‌వాడిన‌నే చెప్పుకొనే చంద్ర‌బాబు ఇంత‌టి విలాస‌వంత‌మైన భ‌వ‌నాన్ని నిర్మించ‌డంతో  ఇప్పుడు ఇది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ అవినీతి ప‌రుడు,తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని కొట్లు కూడ‌బెట్టాడ‌నీ చంద్ర‌బాబు అండ్‌కో విమ‌ర్శించిన రోజు లేదు.జ‌గ‌న్ అక్ర‌మాస్తుల‌కేసుకు సంబంధించి  న‌డుస్తున్న‌ప్పుడు అవినీతి సొమ్ముతో లోట‌స్ పాండ్‌లో విలాస‌వంత‌మైన ఇంటిని న‌ర్మించార‌నీ నానా ర‌చ్చ‌చేశారు.బాబుకుతోడు కొన్ని తెలుగు ప్ర‌ముఖ చాన‌ల్స్ జ‌గ‌న్ ఇంటికి సంబంధించిన విష‌యంలో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి కొన్ని రోజుల‌పాటు అవినీతి సొమ్ముతో ఇంటిని  నిర్మించార‌నీ లైవ్‌లు పెట్టి  మ‌రీ ఊద‌ర‌గొట్టారు.కానీ చంద్ర‌బాబు నాయుడు నిర్మిచిన ఇంటి విష‌యంలో మాత్రం పార్టీనేత‌లు,మంత్రులు,ఎక్క‌డా నోరు విప్ప‌డంలేదు.జ‌గ‌న్ అవినీతిపై ప‌దేప‌దే విమ‌ర్శ‌లు గుప్పించిన బాబు అండ్ బ్య‌చ్ ఇప్పుడు  సైలెంట్  అయిపోయారు.లోట‌స్ పాండ్ లో ఉన్న జ‌గ‌న్ ఇంటి విష‌యంలో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిన బాబు మీడియా ఇప్పుడు  బాబు ఇంటి విష‌యంలో మాత్రం ఏదో నామ‌మాత్రంగా ప్ర‌చారం చేశారు. ఎప్పుడూ మీడియాముదు నిజాయితి ప‌రుడున‌ని చెప్పుకొనే బాబు త‌న ఇంటి విష‌యంలో మాత్రం మీడియాకుకూడా అనుమతి ఇవ్వ‌లేదు.నిత్యం పేద‌వాడిన‌ని చెప్పుకొనే బాబు ఖ‌రీదైన ఇంటిని నిర్మించ‌డం ఏమిట‌ని ప్ర‌జ‌లు  గుస‌గుస‌లాడుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -