అభిమానానికి హద్దులు ఉండవు. తమ కిష్టమైన వాల్లను కలుసుకోవాలనే ఆశ ఆమనిషిని ఎంతజగన్తో ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త భేటీ… 2019లో వైసీపీ విజయం ఖాయం..
దూరానికైనా తీసుకెల్తూంది. అలాంటి సంఘటనే జరిగింది. వైసీపీ అధినేత జగన్ అంటె ఆకుర్రాడికి విపరీతమైన అభిమానం.తను అభిమానించే నాయకున్ని ఎలాగైనా కలుసుకోవాలనే పట్టుదల చివరికి అతని కోరిక నెరవేర్చింది.చివరికి తను అనుకున్నది సాధించాడు.
కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామానికి చెందిన ప్రసాద్ ఏడో తరగతి చదువుతున్నాడు. అతడికి వైఎస్ జగన్ అంటే విపరీతమైన అభిమానం. జగన్ను ఎలాగైనా కలవాలనుకున్నాడు. ఫొటో దిగాలనుకున్నారు. చిన్నపిల్లాడు కావడంతో ఇంతకాలం వీలు పడలేదు. జగన్ మీద ఉన్న పిచ్చి అభిమానంతో కుర్రాడు ఏకంగా రైళ్లేక్కేశాడు.
రైలెక్కి కాచిగూడ స్టేషన్ చేరుకున్న కుర్రాడికి ఎక్కడికి వెల్లాలో తెలీయలేదు. వాల్లను వీల్లను అడిగి చివరికి లోటస్ పాండ్లోని వైసీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.ఎలా కలుసుకోవాలో తెలియని పరిస్థితి. చివరికి ధై్యం చేసి తను ఎక్కడినుండి వచ్చాడో అన్న వివిరలు సెక్యూరిటీ చెప్పాడు.సాధ్యం కాదని చెప్పినా కార్యలయం ముందు కూర్చుండిపోయాడు.చివరికి కుర్రాడి పట్టుదల చూసి సెక్యూరిటీ విషయాన్ని జగన్కు చేరవేశారు.
దీంతో వెంటనే స్పందించిన జగన్ .. ప్రసాద్ను తన ఇంటిలోకి తీసుకెళ్లారు. ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావ్ అంటూ ఆరా తీశారు.
ఫొటో దిగేందుకు రైలు ఎక్కి వచ్చానని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. పిల్లాడు కనిపించకపోయే సరికి తల్లిదండ్రులు ఆందోళన చెందుతారని భావించిన జగన్ నేరుగా… కుర్రాడి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు. ప్రసాద్ తమ వద్దే ఉన్నాడని ఆందోళన చెందవద్దని సూచించారు.ఎంతో దూరం నుంచి వచ్చిన ప్రసాద్కు జగన్ తన ఇంట్లోనే భోజనం పెట్టి… ఉండేందుకు గదిని కూడా ఏర్పాటు చేశారు. అనంతరం ప్రసాద్ కోరిక మేరకు ఫొటో దిగారు. అంతేకాదు… ఫొటోను ఫ్రేమ్ కట్టించి ప్రసాద్ చేతిలో ఉంచారు. దీంతో ప్రసాద్ ఆనందానికి అవదులు లేవు. రెండు రోజుల పాటు లోటస్ పాండ్లోనే ఉన్న ప్రసాద్ను తిరిగి క్షేమంగా సొంతూరుకు చేర్చాల్సిందిగా పార్టీ నేతలకు జగన్ సూచించారు. జగన్కు పెద్దలంటె అభిమానం,గౌరవంలేవని ప్రచారం చేసె ఎల్లోమీడియా ఇప్పుడు ఏంప్రచారం చేస్తుందో మరి.
Related
- జగన్కు నిజంగా మందు తాగుతాడా..? అసలు నిజం ఏంటి..?
- ఇది చదివితే.. జగన్కు చేతులెత్తి మొక్కడం ఖాయం
- జగన్ పై లోకేష్ మరో బ్లండర్ మిస్టేక్.. టీడీపీనేతలే నవ్వుతున్నారు
- జగన్తో ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త భేటీ… 2019లో వైసీపీ విజయం ఖాయం..