Saturday, May 18, 2024
- Advertisement -

వైయస్ కు పుష్కర స్నానం.. బాహుబలి సీన్ గుర్తుకు తెచ్చిన అభిమానులు

- Advertisement -

ఉమ్మడిగా ఉన్న టైమ్లో ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసినవారిలో అత్యంత ప్రజాధరణ పొందిన వారిలో వైయస్ స్థానమేంటో ప్రత్యేకించి చెపుకోవల్సిన అవసరం లేదు .ఆయన అమరుడైనా కూడా వైయస్ ప్రస్థావన లేకుండా ఏ కార్యక్రమం జరగడం లేదు.

దీనికి సాక్షి… పుష్కరాలే.పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ఆయన అబిమానులు చేరువలోనే ఉన్నటువంటి సిద్దాంతం గోదావరికి వై యస్ విగ్రహాన్ని తీసుకుపోయి గోదావరి స్నానం చేయించారు.

ఏవిషయంలోను లోటు చేయకుండా పిండ ప్రధానం కూడా చేసి తమ అభిమానాన్ని చూపించారు. అయితే ఈ తతంగంపై స్థానిక టిడిపి కార్యకర్తలు గరంగరంగా ఉన్నారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా వైయస్ఆర్ కార్యకర్తలపై సెటైర్లు వేశారు.

ఎప్పటిలాగే వైయస్ అభిమానులు ఇవేమి పట్టించుకోకుండా తమ ప్రాణానికి తాము పుణ్యస్నానం చేయించామని ముక్తకంఠంతో చెప్పేసరికి సిద్దాంతం బ్రిడ్జ్ దగ్గరున్న టిడిపి శ్రేణులకు నోటి మాట రాలేదంట.

విగ్రహానికి పుణ్యస్నానం చేయించడం చూస్తే… బాహుబలిలో శివుడు శివలింగానికి స్నానం చేయించినట్లుగా ఉందని బాహుబలి సినిమా సీన్ ను గుర్తుకు చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -