ఏపీ టీడీపీలో మేధావుల సంఖ్య పెరిగిపోతోంది.మేధావులంటె మామూలు మేధావులుకాదు ఐన్స్టీన్ కంటె గొప్ప మేధావులు బయటపడుతున్నారు.గతంలో బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ జలీల్ఖాన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన దేశవ్యప్తంగా ఫేమస్ అయ్యారు.
మంత్రిగా లోకేష్ మంత్రి అయిన తర్వాత చినబాబు లోకేష్ ఫిజిక్స్ను మించిన వ్యాఖ్యలెన్నో చేశారు.జలీల్ఖాన్కు తమ్ముడిలా తయారయ్యారు.సోషియల్ మీడియాలో నెటిజన్లు చినబాబను ఏవిధంగా దుమ్ముదులిపారో అందరికి తెలిసిందే.
{loadmodule mod_custom,GA1}
కాని 30 సంవత్సరాల రాజకీయ అనుభవం,మూడోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చంద్రబాబు కూడా మరో జలీల్ఖాన్లా తయారయ్యారు.విజయవాడలో బ్యాట్మంటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ సన్మానసభలో నోబుల్ ప్రైజ్ గురించి బాబు చేసిన వ్యాఖ్యలు సోషియల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఒలంపిక్స్లో గెలవాలి…మొదటి స్తానంలో ఎవరు వస్తే వాల్లకు నోబెల్ ప్రైజ్ ఇస్తా ..ఇక్కడే సన్మానం చేస్తా అదే నాఆశయం..డ్రీమ్ అని సెలవిచ్చారు.అసలు నోబెల్ ప్రైజ్ను శాంతి,శాస్త్ర,సాంకేతిక,సామాజికసేవ రంగాలలో ప్రముఖులకు ఈప్రైజ్ను ప్రకటిస్తారు.క్రీడలకు స్తానమే లేదు.మరి బాబు ఎక్కడనుంచి తెస్తారో.
{loadmodule mod_custom,GA2}
ఇంకేముంది సోషియల్ మీడియాలో నెటిజన్లు ఆడుకుంటున్నారు.బాబుగారిని జలీల్ఖాన్కు అన్నయ్య అందామంటె లోకేష్ ఉన్నాడు..మరి తాత అనచ్చేమోనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.నోబెల్ ప్రైజ్ అని చేసిన వ్యాఖ్యలు చేయడానికి కొద్ది నిమిషాల ముందు లోకేష్ టీడీపీ నుంచి పీవీ ప్రధాని అయ్యారని వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు.అందుకే టీడీపీలో జలీల్ ఖాన్లు పెరిగిపోతున్నారు ..ఇంకెంత మంది ఉన్నారో అలాంటి ఆణిముత్యాలు.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}QSZIQ1vJi9k{/youtube}