Friday, May 10, 2024
- Advertisement -

మోడీ ని వశం చేసుకుంటున్న కెసిఆర్ ?

- Advertisement -

తెలంగాణా కి ఎ నిమిషం లో ముఖ్యమంత్రి అయ్యారో కానీ కెసిఆర్ ది తిరుగులేని రాజకీయ నైజం గా కథ నడుస్తోంది. తాను అనుకున్నది సాధించడం లో ఎంతో క్లారిటీ మైంటైన్ చేసే కెసిఆర్ నరేంద్ర మోడీ ని వశం  చేసుకోవడం లో చంద్రబాబు ని మించి పోతున్నారు అని అర్ధం అవుతోంది.

నరేంద్ర మోడీ కి నచ్చే విధం గానే కెసిఆర్ నడవడిక ఉంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియా ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జీఎస్ టి బిల్లును ఆమోదించేందుకు తెలంగాణ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని నిర్ణయించామని తెలిపారు.

ఈ సమావేశాలనే వర్షాకాల శాసనసభ సమావేశాలుగా కొనసాగిస్తామన్నారు. జీఎస్ టీ బిల్లుకు దేశంలోని 50 శాతంపైగా రాష్ట్ర శాసనసభలు ఆమోదం తెలపాల్సి ఉన్న నేపథ్యంలో జీఎస్ టికి తెలంగాణ మద్ధతు ఇస్తున్నందున ప్రత్యేకంగా శాసనసభా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామని కేసీఆర్ తెలిపారు. 2016 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రత్యేక సమావేశం ఉంటుందని ఇందుకోసం గవర్నర్ – స్పీకర్ తో మాట్లాడామని కేసీఆర్ చెప్పారు. వర్షాకాలం సమావేశాలుగా కూడా వీటినే కొనసాగిస్తామని ఆయన వివరించారు.

హైకోర్టు విభజన విషయం లో మ్మోదీ హామీ ఇచ్చారు అని కొత్త పాట పాడుతున్నారు . మొన్నటి వరకూ డిల్లీ వెళ్తా ధర్నా చేస్తా అన్న కెసిఆర్ సడన్ గా మాట మార్చారు.

Related

  1. కెసిఆర్ జీతం ఎంత చంద్రబాబు జీతం ఎంత ?
  2. కెసిఆర్ ఒకే దెబ్బకి రెండు పిట్టలు కొట్టారు
  3. కేటీఆర్ మాటని లెక్క జేయ్యని కెసిఆర్ .. తెరాస లో ఏం జరుగుతోంది ?
  4. మోడీ ని పోట్టచక్కలు అయ్యేలా నవ్వించిన చంద్రబాబు – ఎంపీ
  5. మోడీ చేసిన పనికి డీలా పడిపోయిన చంద్రబాబు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -