Wednesday, May 1, 2024
- Advertisement -

వైసీపీలోకి వ‌ల‌స‌ల ప‌ర్వం

- Advertisement -
Mudragada Padmanabham joining YSRCP

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాల‌లో శ‌ర‌వేగంగా మార్పులు చో్టు చేస‌కుంటున్నాయి.ప్ర‌తి ప‌క్ష వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరిగిపోతున్నాయి.తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన ఒక సామాజిక ఉద్య‌మ‌నేత మాజీ మంత్రి వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

దీంతో పార్టీ బ‌లోపేత మ‌వ‌డంతోపాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అజిల్లాల్లో దూసుకెల్ల‌నుంది. ఆయ‌న రాక‌తో టీడీపీ శ్రేణుల్లో అల‌జ‌డి మొద‌ల‌య్యింది.
కాపుల రిజ‌ర్వేష‌న్ల‌కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న టీడీపీ మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వైసీపీలోకి ముహూర్తం ఖ‌రార‌యిన‌ట్లు తెలుస్తోంది.వైసీపీ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ముద్ర‌గ‌డ‌తో స‌మావేశ‌మై పార్టీలోకి చేర్చుకొనే వియంపై చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది.ప్ర‌స్తుతం ఈ వార్త వైసీపీ శ్రేణుల్లోనూ… కాపు వ‌ర్గంలోనే చ‌ర్చ జ‌రుగుతోంది.

{loadmodule mod_custom,GA2}

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని హామి ఇచ్చిన చంద్ర‌బాబు అధిక‌రాంలోకి రాగానే దాన్ని విస్మ‌రించారు.అప్ప‌టినుంచి మ‌ద్ర‌డ‌గ ప‌ద్మ‌నాభం రిజ‌ర్వేష‌న్ల‌కోసం పోరాటం కొన‌సాగిస్తున్నారు.ఉద్య‌మాన్ని బ‌లోపేతం చేసేందుకు వైసీపీ లో చేర‌డానికి నిర్న‌యించుకున్న‌ట్లు కాపు వ‌ర్గం అంటోంది.పార్టీలో చేరినా ఉద్య‌మాన్ని మాత్రం తీవ్ర‌త‌రం చేస్తామ‌ని కరుణాక‌ర్‌రెడ్డితో చెప్పిన‌ట్లు స‌మాచారం.పార్టీలో ఉండి మీ ఎంజెండాతో ఉద్య‌మాలు చేసుకోవ‌చ్చ‌ని అందుకు జ‌గ‌న్‌ని ఒప్పిస్తాన‌ని భూమ‌న ముద్ర‌గ‌డ‌కు హామి ఇచ్చార‌ని తెలుస్తోంది.

{loadmodule mod_custom,GA1}

అయితే పార్టీలో చేరే విష‌య‌మై త‌మ సామాజికి వ‌ర్గ‌నాయ‌కుల‌తో స‌మావేశం అయి చ‌ర్చించిన త‌ర్వాత నిర్న‌యం తీసుకుంటాన‌ని ముద్ర‌గ‌డ స్ప‌ష్టంచేసిన‌ట్లు తెలుస్తోంది.జ‌గ‌న్ న్యూజిల్యాండ్‌నుంచి తిరిగి రాగానే భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసి త‌న అనుచ‌ర గ‌నంతో పార్టీ చేరాల‌ని ముద్ర‌గ‌డ నిర్న‌యించు కొన్న‌ట్లు తెలుస్తోంది.ఆయ‌న చేరిక‌తో వైసీపీ బ‌లోపేతం అవ‌డంలో సందేహం లేదు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -