ఇద్దరూ ఇద్దరే ఇదేదో సినమా టైటిల్ అనుకుంటున్నారా! అయితే పప్పులో కాలేసినట్లే.బీకాంలో పిజిక్స్,జయంతికి వర్థంతికి తేడాతెలియని నాయకుల గురించి. అ ఇద్దరూ ఈపాటికి ఎవరో అర్థమయ్యే ఉంటుంది. అ ఇద్దరు ఎవరో కాదండోయ్..ఒకరు టీడీపీ ఎమ్ ఎల్ఏ జలీల్ఖాన్,మరోకరు ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడి సుపుత్రుడు కేబినేట్ మంత్రి నారాలోకేష్ నాయుడు.ఏపీలో ఎక్కడ చూసినా ఈఇద్దరిగురించే చర్చ. జలీల్ఖాన్ ఈయన 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీనుంచి గెలిచి తర్వాత టీడీపీలోకి వెల్లిన విజయవాడ వెష్ట్ అసెంబ్లీ నియేజక వర్గం వైసీపీ ఎమ్ఎల్ఏ. ఇప్పుడ జలీల్ఖాన్ అంటే తెలియని వారుండరు.
అంతగా పేమస్ అయ్యారు. ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వూలో కామర్స్లో ఫిజిక్స్ చదివానంటూ అడ్డంగా బక్కయ్యారు. బహూశ కామర్స్లో పిజిక్స్ చదివిన ఒకో ఒక్కడు జలీల్ఖాన్. ఇంకే ముందు షోషియల్ మీడియా ఒక అట ఆడుకుంది. దాన్ని కూడా మనవాడు బాగానే కవర్ చేశాడండోయ్. దీని వల్ల నాకు పాపులారిటీ బాగా వచ్చిందనీ కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆయన సరసన ఇంకొకు చేరారు.ఆయన ఎవరో కాదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడు కేబినేట్ మంత్రి నారా లోకేష్ నాయుడు.భారత రాజ్యాంగ నిర్మాత అంబేత్కర్ జయంతని వర్ధంతని చేసి ఏప ప్రజలకు మీడియాకు అడ్డంగా బుక్కయ్యారు. ఇక మీడియా ఊరుకుంటుందా చెప్పండి చినబాబును చెడుగుడు ఆడేసుకుంది.
భారతరత్న అవార్డుగ్రహీత భారత రాజ్యాంగ నిర్మాత అంబేత్కర్ జయంతి సందర్భంగా విజయవాడలోని తుమ్ముల పల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయిన లోకేష్ జయంతి అనకుండా వర్థంతని బుక్ అయ్యారు.గత ఎన్నికల ప్రచారంలో జరిగిన సభలో అవినీతి, కులపిచ్చి,మతపిచ్చి,ఉన్న ఏకైక పార్టీ ఉదంటే అది తెలుగుదేశం పార్టీఅని అనడంతో అందరూ కంగుతిన్నారు.
అదేదే అప్పట్లో రాజకీయాలకు కొత్త అనుకోవచ్చు… కానీ కేబినేట్ మంత్రి అయిన తర్వాత కూడా మారలేదు. ఆంబేత్కర్ జయంతి కార్యక్రమంలో మాట్లాడటానికి సిద్దమైన లోకేష్ జయంతిని వర్థంతిగా మార్చేశారు. అంతేసభలోని వాల్లంతా వర్థంతికాదు జయంతని అనడంతో బిత్తరపోయిన లోకేష్ గొంతు సవరించుకున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా లోకేష్ తడబడ్డాడు. శ్రధ్దాపూర్వకంగా పనిచేస్తానిని చెప్పకుండా శ్రధ్దాంజలితో పనిచేస్తానని ప్రమానం చేశారు. ఏదైనా కార్యక్రమానికి హాజర్యేముందు దాని గురించి తెలుసుకొన వెల్తారు.మంత్రిగా ఉన్న లోకేష్ అదికూడా తెలియదానీ సోషియల్మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేశారు. జయంతికి వర్థంతికి తేడా తెలియని లోకేష్ తెలుగు ప్రజలను ఏం పరిపాలిస్తాడని జనం చెప్పుకుంటున్నారు.
జలీల్ఖాన్లాగా కామర్స్లో పిజిక్స్ చదివాడానీ జనాలు తెగ నవ్వుకుంటున్నారు. జలీల్ఖాన్కు మరోతమ్ముడు దొరికాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మామ బాలకృష్ణకూడా గతంలో పప్పులో కాలేశారు. శ్రీకాకులం జిల్లాలో ఎన్నికల ప్రజారంలో జగన్ దే అధికారంనీ మీడియాకు అడ్డంగా బుక్కయ్యారు.మామకు తగ్గ అల్లుడు అనిపించుకున్నారు. ఒకరు కామర్స్లో పిజిక్స్ చదివాని….ఇంకొకరికి జయంతికి వర్థంతికి తేడాతెలియని వాల్లా తెలుగు ప్రజలను పాలించేదని ….తెలుగు ప్రజలకు ఇదే ఖర్మనీ సిగ్గుతో తలదించుకుంటున్నారు.
Related