పవణ్ కళ్యాణ్ ఎప్పుడూ ఎలా స్పందిస్తాడో ఎవరికీ అర్థంకాదు.ఏపీకీ ప్రత్యేక హోదాపై పులు సార్లు వ్యాఖ్యానించిన పవణ్ తాజాగా మరోసారి స్పందించారు. రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చ సందర్భంగా తన ట్విట్టర్లో అభిప్రాయాన్ని వెల్లడించారు. చర్చజరతున్న సందర్భంలో తేదేపా ఎంపీలు సభలో లేకపోవడాన్ని పవణ్ తప్పు పట్టాడు. ఈ విషయంలో ట్విట్టర్ ద్వారా పలు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ సభ్యుడు కేవిపీ.రామచంద్రరావు ప్రవేశ పెట్టిన తీర్మానంలో చర్చ కొనసాగింది.
చర్చలో తెలుగు రాస్ట్రాలనేతలతో పాటు ఇతర పార్టీల అభ్యర్తులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. బీజేపీతో బంధం కొనసాగిస్తున్న టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదాపై చర్చజరుగుతున్న సందర్భంగా సభలో ఎవరూలేకపోవడాన్ని విమర్శించారు. … కేంద్రమంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు కూడా కనీసం ఒక్కమాటకూడా మాట్లాడకపోవడం భాదేస్తోందన్నారు. ఈ విషయంలో కేంద్రంతో రాజీపడటం సరికాదని…2014 ఎన్నికల్లో ఈహామీతోనే అధికారంలోకి వచ్చారన్నారు. మరో ట్వీట్లో ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో జాగ్రత్తాగా వ్యవహరించడం మంచిదేనని…. పదేపదే అన్యాయమే జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం మంచిది కాదన్నారు.
వ్యక్తిగత అవసరాలకోసం ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టకండనీ పవణ్ ట్వీట్లో స్పందించారు. వ్యక్తిగత అవసరాలకంటే ప్రజలనమ్మకమే ముఖ్యమన్నారు. ప్రత్యేక హోదాపై చర్చజరుగుతున్న సమయంలో పక్కనున్న రాష్ట్ర ఎంపీలు తెలుగు రాష్ట్రాల ఎంపీలు కె.కేశవరావు.. రాపోలు ఆనందభాస్కర్.. విజయసాయిరెడ్డిలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక మరో ట్వీట్లో రాష్ట్ర విభజన అంశంలో అటు కేంద్రంపై కూడా విమర్శలు గుప్పించారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ని విభజించాలని డిమాండ్లు వస్తున్నాయి. మరి యూపీ కూడా విభజన చేయగలరాని ప్రశ్నించారు. రూల్స్ కేవలం దక్షిణాది రాష్ట్రమైన ఏపీకి మాత్రమే వర్తిస్తాయాన్నారు. పవణ్ చేసిన ట్వీట్లపై తెలుగు తమ్ముళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
Related