పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఒకప్పటి హీరోయిన్ గా నటించిన ఖుష్బూను తీసుకున్నారు. ఈ రోజు నుంచి ఖుష్బూ షూటింగ్ లో పాల్గొన్నారు. పవన్, ఖుష్బూ మధ్య వచ్చే కొన్ని సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సంగతిని స్వయంగా ఖుష్బూ చెప్పారు.
పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ పైకి వచ్చానని, మొదటి రోజు స్కూల్ కు వెళ్లిన అనుభూతి కలిగిందని ట్వీట్ చేశారు. పవన్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది మూవీలో నదియ కీలకపాత్ర పోషించింది. సినిమాలో ఆ క్యారెక్టర్ ఎంత క్లిక్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు అలాంటిదే మరో పవర్ ఫుల్ పాత్రను ఖుష్బుకు ఆఫర్ చేశాడట త్రివిక్రమ్. తెలుగు లో సెలక్టివ్ గా సినిమాలు చేసే ఖుష్బూ.. త్రివిక్రమ్ చేప్పిన క్యారెక్టరైజేషన్ చాలా స్పెషల్ గా ఉండడం వల్లనే ఒప్పుకున్నట్లు తెలిపారు.
సెట్స్ లో తనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని చెప్పిన ఖుష్బు.. ఈ సినిమా కోసం హైదరబాద్ లో 10 రోజులు ఉండబోతుంది. ఖుష్బూ.. స్టాలీన్, యమదొంగ సినిమాల తర్వాత చేస్తున్న సినిమా ఇదే. స్టాలీన్ లో చిరంజీవి అక్కగా, యమదొంగలో యముడి భార్య గా నటించిన ఖుష్బు.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Related