ప్రజల్లో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల.. ఎలాంటి అభిమానాన్ని చూపిస్తున్నారో అనే విషయం.. ఆఖరికి ఓ హీరోయిన్ కి కూడా అర్ధం అయింది. అయితే ఈమె తెలుగు హీరోయిన్ కాదు.. అలా అని తెలుగులో కూడా పెద్దగా సినిమాలు చేయలేదు. అయినప్పటికి.. ప్రజల్లో జగన్ కు ఉన్న క్రేజ్ గురించి తెలుసుకుంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై గురించి హీరోయిన్ సునీతా రానా ఎలాంటి కామెంట్స్ చేసిందో తెలియలంటే పూర్తి వివరాలకు వెళ్లాల్సిందే. యువత.. రాజకీయాల్లోకి అడుగు పెడితే.. ఎలాంటి ప్రభావం కనిపిస్తుందో అనేదానికి వైఎస్ జగన్ నిదర్శనం. నేను(సునీతా రానా ) పంజాబ్లో పుట్టి.. హర్యానాలో పెరిగి.. పూణేలో సెటిల్ అయ్యాను. సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు రావడంతో.. ఆర్నెల్ల క్రితం హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యా. మొదటి నుండి నాకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నప్పటికి.. జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడకు లక్షలాదిగా జనం రావడం ఆశ్చర్యం కలిగించింది. జగన్ కు ఉన్న జనాకర్షకశక్తి.. ఏ నేతకు లేదు. ప్రజల పట్ల ఆయన చూపించే ప్రేమాభిమానాలే.. అంతటి ఆదరణకు కారణమని తెలుసుకున్నా. ప్రస్తుతం జగన్ లాంటి నాయకుడు చాలా అవసరం. మరో ముఖ్య విషయం ఏంటంటే.. ప్రజలు తాము వేసిన ఓటు వృధాకాకుండా సమర్ధులైన నేతలనే ఎన్నుకోవాలి.
అయితే జగన్ ప్రభంజనాన్ని చూసి ఈ అమ్మడు ఎంతటి మంత్రముగ్దురాలైందో అన్నదే ఆసక్తి. ఎందుకంటే.. ఎక్కడో పంజాబ్ లో పుట్టిన ఈమె నాలుగు రోజుల షూటింగ్ కోసం వచ్చి.. జగన్ అంటే ఏంటి.. జగన్ కు ఉన్న పవర్ ఏంటి అనేదిస్పష్టంగా అర్థమైంది. ఏది ఏమైన అధికారంలో ఉన్న నాయకులను వదిలి పెట్టి.. ప్రతి పక్షంలో ఉన్న నాయకుడిపై ఇలాంటి కామెంట్స్ చేసిందంటే.. నిజంగా వైసీపీ అభిమానులకు పండగే.