Sunday, May 19, 2024
- Advertisement -

వచ్చే ఎన్నికల నేపథ్యంలో రైతులు, కూలీలకు సూపర్ ఆఫర్ ప్రకటించిన వైసీపీ

- Advertisement -
Ysrcp Good News Farmesr

ఏపార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ప్ర‌జ‌ల‌కు వారిచ్చే హామీల మీద‌నే అధార‌ప‌డిఉటుంది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అనేక హామీలుఇచ్చిన చంద్ర‌బాబు అధికారాన్ని చేప‌ట్టారు. అదికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రైతు స‌మ‌స్య‌ల‌ను తీరుస్తామ‌ని ప్ర‌క‌టించారు.ప్ర‌ధానంగా రైతు రుణ‌మాపీ ఒకే సారి అమ‌లు చేస్తాన‌ని ప్ర‌క‌టించి మాట‌త‌ప్పారు. రుణ మాపీ ఇప్ప‌టి వ‌ర‌కు ఏరైతుకు స‌క్ర‌మంగా అంద‌లేదు.దీనికి తోడు రాష్ట్రంలో క‌రువు తాండ విస్తోంది. అయితే క‌రువు నివార‌ను బాబు  ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోలేదు. దీంతో ప్ర‌జ‌లు టీడీపీపై అస‌హ‌ణం వ్య‌క్తంచేస్తున్నారు.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో  అధికారంలోకి వచ్చిన టీడీపీ …. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష వైసీపీకీ ఒట్ల తేడా 2శాత‌మే. అంటే అక్ష‌రాల ఐదు ల‌క్ష‌లు మాత్ర‌మే. ఎన్నిక‌ల స‌మ‌యంలో నెర‌వేర్చ‌లేని 600 పైగా హామిలిచ్చిన బాబు అధికారంలోకి రాగానే తుంగ‌లోకి తొక్కర‌న‌డంలో సందేహంలేదు.వీటిలో ప్ర‌ధానంగా ప్ర‌త్యేక‌హోదా,రైల్వే జోన్ వంటి వాటిని వ‌దిలి పెట్టి టీడీపీ నాయ‌కులందూ అందిన‌కాడికి దోచుకుంటున్నార‌ని వైసీపీ ఆరోప‌ణ‌లు చేస్తోంది.

ఈమ‌ధ్య స‌ర్వేలో 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తూంద‌ని స‌ర్వేలు సూచిస్తున్న‌నేప‌థ్యంలో రైతుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది వైసీపీ. అదికారంలోకి వ‌చ్చ‌న వెంట‌నే క‌రువు ప్రాంతాల్లో ఉన్న రైతులు,రైతుకూలీల స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో పెట్టుకొని రూ.4వేల రూపాయ‌లు పింఛ‌న్ మంజూరు చేసి రైతుల‌ను ఆదుకుంటామ‌న్నారు.క‌డ‌ప జిల్లా సంబేప‌ల్లి మండ‌లం శెట్టిప‌ల్లి గ్రామ రైతులు,కూలీల‌తో క‌రువు ప‌రిస్థితుల‌పై వైసీపీ పార్టీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి చ‌ర్చించారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి ఎప్పుడు వ‌చ్చినా రాష్ట్రంలో క‌రువు వ‌స్తుంద‌న్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చి మూడు సంత్స‌రాలుగా రైతులు క‌రువుతో అల్లాడుతున్నార‌ని ..వారిని అదుకొనే చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో బాబు విఫ‌ల‌మ‌య్యార‌నీ విమ‌ర్శించారు.రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న అభివృద్దికార్య‌క్ర‌మాల్లో ప్ర‌తీ దాంట్లో పార్టీ నేత‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌న్నారు. రైతులు,రైతుకూలీల‌ను ఆదుకోకుంటే  ఆందోళ‌న చేస్తామ‌ని స‌ర్కార్‌ను హెచ్చ‌రించారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బాబు, లోకేష్ లు మైండ్ బ్లాక్ అయ్యే వార్నింగ్ ఇచ్చిన వైసీపీ మహిళా నేత
  2. జగన్‌తో ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త భేటీ… 2019లో వైసీపీ విజయం ఖాయం..
  3. రాష్ట్ర రాజ‌కీయాల‌లో తీవ్ర ఉత్వంఠ‌…వైసీపీ శ్రేనులలో ఆందోళ‌న‌
  4.  వైసీపీ …టీడీపీ మ‌ధ్య సోషియ‌ల్ వార్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -