ఓవైపు తన కుమారుడిని ప్రమోట్ చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానా తిప్పలు పడుతుంటే.. నారా లోకేష్ మాత్రం తన మాటలతో స్వయంగా ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటున్నారు.జయంతిని వర్ధంతని, వచ్చే ఎన్నికల్లో 200 సీట్లలో గెలవాలని అనాలోచితంగా మాట్లాడి ఎలా నవ్వులపాలు అయ్యాడో దేశం మొత్తంమొత్తానికి తెలిసిందే. లోకేష్గారి గొప్పతనాన్ని సోషియల్ మీడియా ఏ విధంగా ఏకిపారేసిందే అందరికీ తెలిసిందే.
అందుకే బాబు,లోకేష్కు సోషియల్ మీడియా అంటే వనికిపోతున్నారు. అందుకే దానిమీద ఉక్కెపాదం మోపడానికి కంకంనం కట్టుకున్నారు. ఇన్నాల్లు ఎన్నితప్పులు చేసినా ఎల్లోమీడియా ద్వారా కప్పిపుచ్చుకొని పబ్బం గడుపుకొనేవారు. కానీ సోషియల్ మీడియా వచ్చిన తర్వాత ఆపప్పులు ఉడకలేదు.అందుకే సోషియల్ మీడియాలో పోష్ట్లు పెట్టిన రవికిరణ్ను అరెస్ట్ చేసి తమ నిజస్వరూపాన్ని నిరూపించుకున్నారు.
బాబు,లోకేష్ తీసుకున్న ఈనిర్ణయంపై అదే సోషియల్ మీడియాలో వ్యతిరేకంగా దండెత్తడంతో రవికిరణ్ను వదిలిపెట్టారు.సోషియల్ మీడియాను నియంత్రిస్తున్న చంద్రబాబు,లోకేష్ ను జాతీయ మీడియా కూడా ఏకిపారేసింది.దీంతో అరెస్ట్ వ్యవహారం ఎక్కడ తన మెడకు చుట్టుకుంటోదన్న భయంతో రవికిరణ్ను వదిలిపెట్టారు. అదే రోజు పోలీసులతో వైసీపీ సోషియల్ వింగ్మీద దాడులు చేయించడంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేను పోస్ట్ లు పెడతా నన్నుకూడా అరెస్ట్ చేయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే విషయంలో వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయ లక్ష్మి బాబు,లోకేష్లకు దిమ్మతిరిగే షాకిచ్చింది.లోకేష్కు దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరింది. సోషియల్ మీడియా పోస్టింగ్లను అడ్డం పెట్టుకొని తమ పార్టీ కార్యాలయంలోకి పోలీసులు దైర్జన్యంగా చొరబడటాన్ని ఖండించారు. పోలీసులు అధికార పార్టీకీ తొత్తుల్లాగా వ్యవహరించకుండా చట్టానికి ప్రతినిధులుగా వ్యవహరించాలని హితవు పలికారు. జగన్ ఒక వైపు ప్రజా సమస్యలపై పోరాడుతుంటే…. మరోవైస చంద్రబాబు,లోకేష్ లు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, అవినీతిని నెటిజన్లు ప్రశ్నించడంతో అసహనానికి లోనవుతున్నారని ….అందుకే సోషియల్ మీడియా మీద కత్తి కట్టారని విమర్శలు చేసింది.
Related