సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటినుంచే వైసీపీ అభ్యర్తుల ఎంపిక పనిలో నిగ్నమైంది.ఒక వైపు ప్ర ప్రజల తరుపున పోరాడుతూ మరో వైపు అభ్యర్తుల వేటలో పడింది.తాజాగా గుంటూరు రాజకీయం రసవత్తరంగా మారింది.ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎంపీకి పోటీగా యువనేతను వైసీపీ నుంచి బరిలోకి దింపనుంది.
వైసీపీనుంచి ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్లిన చోట ఇతర నేతలను ఇంచార్జులుగా రంగంలోకి దింపారు. తాజాగా, గుంటూరు పార్లమెంటు అభ్యర్థిని జగన్ ఇప్పటికే ఖరారు చేశారని తెలుస్తోంది. టిడిపి అక్కడ ఎమ్మెల్యేల చరిష్మా, అసంతృప్తి, నియోజకవర్గాల పునర్విభజన తదితరాలను పరిగణలోకి తీసుకొని లెక్కలు వేసుకోనే పనిలో పడింది.
{loadmodule mod_custom,GA1}
అయితే వైసిపి మాత్రం అప్పుడే గుంటూరు నుంచి 2019లో పోటీ చేసే అభ్యర్థిని దాదాపు నిర్ణయించారని అంటున్నారు. ఓ యువనేతకు ఈ సీటును ఫిక్స్ చేశారనే ప్రచారం సాగుతోంది.విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య తనయుడు కృష్ణదేవరాయను వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి వైసిపి తరఫున పోటీ చేయించనున్నారని తెలుస్తోంది.
కృష్ణ దేవరాయకు జగన్ అంటే వల్లమాలిన అభిమానం. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఆయన పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ తనకు టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైసిపి కోసం, జగన్ కోసం పని చేస్తానని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను జగన్ కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ ఎంపీగా గల్లా జయదేవ్ కోనసాగుతున్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- టీడీపీని వదిలేయడానికి సిద్దంగా ఉన్న జంప్ జిలానీలు
- టికెట్టు శిల్పాకా….. రాజగోపాల్ రెడ్డికా….?
- వైసీపీలో అభ్యర్తుల కసరత్తు ప్రారంభం…
- జగన్ తో చర్చ.. వైసీపీలోకి మెగాస్టార్..?
{youtube}GDy1kHbqF-8{/youtube}