ఆంధ్రప్రదేశ్లో ప్రజాసమ్యలపై పోరాటం చస్తున్న వైసీపీ పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది.2019 సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీని తిరుగులేని శక్తిగా నిలిపేదానికి జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటి నుంచే కార్యచరణను ప్రారంభించారు. ప్రధానంగా సొంత జిల్లా కడపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇప్పటికే జగన్కు ప్రజలల్లో మద్దతు పెరుగుతోంది. మరింత ప్రజాభిమానాన్ని కూడగట్టుకొనేందుకు జగన్ పావులను కదుపుతున్నారు. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వంపై ప్రజలకు వస్తున్న వ్యతిరేకతను వైసీపీకి అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. అనుకున్నదే తడువుగా కార్యచరణ ప్రారంభించారు.
ఏపీ ప్రజలకోసం, పార్టీకోసం చిత్తశుధ్దితో పినచేయాలని శ్రేనులకు పిలుపు నిచ్చారు జగన్. ప్రజాసమస్యలపట్ల ప్రతీ ఒక్కరూ అంకిభావంతో పనిచేయాలనీ సూచించారు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలలో ఎండగట్టాలన్నారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని తీసుకెల్లి పార్టీనీ బలోపేతం చేయాలని జగన్ అదేశించారు.హైదరాబాద్ లోని జగన్ నివాసంలో వైఎస్ఆర్ కడపజిల్లాకు చెందిన నాయకులందరితో చర్చించారు.వీరిలో ప్రధానంగా జిల్లా అధ్యక్షుడు అమర్ నథ్రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి,శ్రీకాంత్రెడ్డి,శ్రీనివాసులు …. పార్లమెంట్ సభ్యులు అవినాష్రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, సీనియర్ నేత మాజీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి,కడప మేయర్ సురేష్ బాబు, జమ్మలమడుగు సమన్వయకర్త సుధీర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూర నాగేందర్రెడ్డిలతో సమావేశం నిర్వహించారు.
పార్టీని బలోపేతం చేయాలంటే గ్రామకమిటీల యందు దృష్టి సారించాలన్నారు. గ్రామకమిటీలు బలంగా ఉంటే పార్టీ అంత పటిష్టంగా ఉంటుందన్నారు. అందు కోసమే గ్రామ కమిటీలను పటిష్టం చేయాలని సూచించారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని తీసుకెల్లాలన్నారు.దీ ని ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెల్లడంలో ప్రజా సమస్యలను సైతం పరిస్కరించేదానికి అవకాశం ఉంటుందన్నారు. గ్రామ కమిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎన్నికలకు రెండు సంవత్సరాలు సమయం ఉన్నా జగన్ ముందుగాలనే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి నుంచే పార్టీ శ్రేనేలను అప్రమత్తం చేస్తూ ముందుకెల్తున్నారు.
Related