Friday, April 26, 2024
- Advertisement -

రానా బావ అంటూ పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి..!

- Advertisement -

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, మిహీకాల నిశ్చితార్థం ఈ రోజు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో జరగబోతుంది. ఈ నిశ్చితార్థం రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 4గం.లకి జరగనుంది. ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన కొద్ది మంది మాత్రమే హాజర్ కానున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉండటంతో అతి తక్కువ మంది మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం రానా ఎంగేజ్మెంట్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టైంలో ఆ ఫ్యామిలీతో వివాదాస్పదంగా సంబంధాలు కలుపుకున్న నటి శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఆ మధ్య రానా, మిహీకాలకు శుభాకాంక్షలు చెప్పిన శ్రీరెడ్డి.. ఇప్పుడు రానా నిశ్చితార్థం గురించి స్పందిస్తూ.. రానా బావకు పెళ్లి అంటూ పోస్ట్ చేసింది. ‘రానా బావకు ఎంగేజ్ మెంట్ ఈరోజే. రామానాయుడు స్టుడియోలో.. నెక్స్ట్ నాదే’ అంటూ కన్ను కొట్టే ఎమోజీతో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. దాంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ దూమారం రేపింది. శ్రీరెడ్డికి రానా తమ్ముడు అభిరామ్తో ఎఫైర్ ఉందని ఇదివరకే తెలిపింది.

అంతేకాకుండా వీరిద్దరు ఏకాంతంగా గడిపిన ఫోటోలను కూడా శ్రీరెడ్డి బయటపెట్టి రచ్చ చేసింది. వీలైన ప్రతిసారి దగ్గుబాటి ఫ్యామిలీతో రిలేషన్ కలుపుకుంటూ వస్తుంది. ఇక సురేష్ బాబుని మామా అని.. రానాని బావా అని.. వెంకటేష్ని చిన మామా అంటూ గతంలో కూడా వరసలు కలిపిన ఈ భామ.. తాజాగా రానా తమ్ముడి గురించి మాట్లాడకుండా.. రానా బావ పెళ్లి తర్వాత నెక్స్ట్ పెళ్లి నాదే.. అనడం మళ్లీ రచ్చకు దారితీసేలా చేసింది శ్రీరెడ్డి. దాంతో రానా ఫ్యాన్స్ శ్రీరెడ్డిపై మండిపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -