- Advertisement -
ఈ నెల 26న నవరత్నాల అప్గ్రేడ్ వెర్షన్ మేనిఫెస్టో వస్తుందన్నారు సీఎం జగన్. మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగింపు సభ లో మాట్లాడిన జగన్..26న వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఆచరణ సాధ్యమయ్యే హామీలనే మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు తెలిపారు. మహిళలు, యువత, రైతులే టార్గెట్గా మేనిఫెస్టో ఉండనున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో నవ రత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేశామని..ఈసారి దానికి అప్గ్రేడ్ వెర్షన్తో జగన్ మేనిఫెస్టో ఉండనుంది. మౌలిక సదుపాయాల కల్పనపై హామీలను మ్యానిఫెస్టోలో చేర్చే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చారు జగన్. ఇదే అంశాన్ని ప్రజల ముందు ప్రస్తావిస్తు బస్సుయాత్రలో చెప్పుకొచ్చారు.