Friday, April 26, 2024
- Advertisement -

పిచ్చ కోపంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫాన్స్

- Advertisement -

పవన్ కళ్యాణ్ ఫాన్స్ పిచ్చ చిరాకు లో ఉన్నారు. డాలీ , బాబీ , దాసరి , జానీ , సూర్య ఇలాంటి వారు అందరూ పవన్ కళ్యాణ్ ని చుట్టుముట్టి ఉండడం తో వారి కోపం తీవ్ర రూపం దాలుస్తోంది. ఒక పక్క మహేష్ బాబు మురుగదాస్ , రాజమౌళి లాంటి వారికి డేట్ లు ఇస్తుంటే .. ఎన్టీఆర్ కూడా కొరటాల శివ లాంటి డైరెక్టర్ లతో చేస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం స్క్రాప్ అందరికీ అవకాశాలు ఇవ్వడం అసలు నచ్చడం లేదు వారికి.

పైగా ఇప్పుడు తమిళం లో సూపర్ హిట్ అయిన అజిత్ సినిమా వేదాలం ని రీమేక్ చెయ్యబోతున్నాడు కళ్యాణ్ అని వస్తున్న వార్తల మీద వీరు మండి పడుతున్నారు. దీనికంటే ఎస్ జే సూర్య ని డైరెక్టర్ గా పెట్టుకుని ఖుషి 2 తీయడం బెటర్ అని ఫీల్ అవుతున్నారట.ఖుషి సీక్వల్ గా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని అర్ధం పట్టేలా ఖుషి-2 వస్తే సూపర్బ్ అనుకున్నారు.

కాని లాస్ట్ ఇయర్ దీపావళికి వచ్చి కోలీవుడ్లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన ‘వేదలం’ సినిమా రీమేక్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరైతే పవర్ స్టార్ ఎస్.జె సూర్యతో తీసేది వేదలం తెలుగు రీమేక్ అని కన్ఫాం గా చెప్పేశారు.   వేదాలం వద్దు బాబూ ఖుషీ 2 అన్నా తీయి లేదా అనుభవం ఉన్న దర్శకుడికి ఛాన్స్ ఇమ్మని కళ్యాణ్ ఫాన్స్ మొత్తుకుంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -