Friday, April 26, 2024
- Advertisement -

పించ్ మెరుపు సెంచ‌రీ….త‌ర్వాత చేతులెత్తేసిన మిడిలార్డ‌ర్ బ్యాట్స్ మేన్‌

- Advertisement -

ప్ర‌పంచ క‌ప్‌లో భాగంగా లాడ్స్ మైదానంలో జ‌ర‌గుతున్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఆసిస్ కెప్టెన్ ఆరోన్ పించ్ మెరుపు సెంచ‌రీ చేశారు. ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (100) క్రీజులో ఉన్నంతసేపు 340 పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించేలా కనిపించిన ఆసీస్ పించ్ అవుట్ అవ‌గానె మిగితా బ్య‌ట్స్ మేన్స్ చేతులెత్తేశారు. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ ఎవరూ నిలదొక్కుకోకపోవడంతో కనీసం 300 పరుగుల మార్కు కూడా చేరుకోలేకపోయింది. మ్యాక్స్ వెల్, స్టొయినిస్ నిరాశపరిచారు. స్మిత్ 38 పరుగులు చేసినా బ్యాట్ ఝుళిపించే సమయంలో అవుట్ కావడంతో ఆసీస్ భారీ స్కోరు ఆశలకు బ్రేక్ పడింది. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 27 బంతుల్లో 38 పరుగులు చేయడంతో కంగారూలకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. వోక్స్ 2 వికెట్లు తీయగా, ఆర్చర్, వుడ్, స్టోక్స్, అలీ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ఆసీస్ పై ఒత్తిడి పెంచారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు మంచి ఆరంభం లభించింది. ఫించ్, వార్నర్ ఇంగ్లాండ్‌ సమర్థవంతమైన బౌలింగ్‌ను గట్టిగా ఎదుర్కొన్నారు. ఇద్దరు ఆటగాళ్లు ఒకే స్థాయిలో బ్యాటింగ్ చేస్తూ అర్ధశతకాలు పూర్తి చేసి ఆతిథ్య బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఎట్టకేలకు వార్నర్‌ను మొయిన్ అలీ ఔట్ చేయడంతో ఇంగ్లాండ్‌కు తొలి వికెట్ దక్కింది. దీంతో 123 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -