యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడ్ పెంచాడు. ఈ ఏడాది ఆరంభం నుంచే తన దూకుడు ప్రదర్శిస్తూ గతంలో ప్రకటించిన సినిమాలు ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఆయన సలార్ షూటింగ్లో పాల్గోంటుండగా.. ఈరోజు ప్రభాస్ ముంబైలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆదిపురుష్ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు.ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన ప్రభాస్.. టైటిల్ లోగోతో కూడిన ‘ఆదిపురుష్’ ఆరంభ్ అనే సందేశాన్ని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ రోజు (మంగళవారం) ముంబైలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ప్రభాస్తో మరో సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేశ్ గా నటిస్తున్నాడు. ఇక సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోందని సమాచారం. ప్రభాస్ సోదరుడు అంటే రామునికి లక్ష్మణుడి పాత్రను ఎవరు చేస్తారు అన్న దానిపై మాత్రం రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఈ చిత్రంలో ఆ రోల్కు బాలీవుడ్ కు చెందిన యువ నటుడు సన్నీ సింగ్ పేరు వినిపించగా తాజాగా టైగర్ ష్రాఫ్ పేరు వినపడుతోంది. ప్రభాస్ తల్లి కౌశల్య పాత్రలో హేమమాలిని కనిపించనుందని టాక్ నడుస్తోంది.
ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో తెలరకెక్కుతున్న ఈ సినిమా 2022 ఆగస్ట్ 11న విడుదల చేయనున్నారు. ప్రభాస్ కెరీర్లో 22వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఆదిపురుష్’పై రెబల్ స్టార్ ప్యాన్స్కు భారీ అంచనాలు ఉన్నాయి.
‘అబ్బే.. ఎన్టీఆర్ ముందు చిరంజీవి సరిపోడు’
మొసలితో పరాచకాలు.. చివరికి ఏం జరిగిందంటే?