Tuesday, April 30, 2024
- Advertisement -

మొసలితో పరాచకాలు.. చివరికి ఏం జరిగిందంటే?

- Advertisement -

సాధారణంగా మొసలిని చూడగానే భయంతో ఆమడ దూరం పారిపోతాము. ఒక్కసారి మొసలి చేతికి దొరకామంటే ఇక అంతే సంగతులు మన ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటి భయంకరమైన ఓ మొసలితో ఓ వ్యక్తి ఎంతో పరాచకాలు ఆడాడు. దూరంగా రండి అంటూ ఈ ఘటన చూసిన స్థానికులు ఎంతవారించినా వారి మాటలు వినకుండా అతని మొండి పట్టుదల విడవకుండా మొసలితో పరాచకం చేశాడు. చివరికి ఏమైందో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం…

గుజరాత్ కి చెందిన పంకజ్ కాసేపు అలా సేదదీరుదామని నది ఒడ్డుకు వెళ్ళిన ఆ వ్యక్తి ఒక పెద్ద సాహసమే చేశాడు. నది ఒడ్డున కూర్చున్న అతడు నది తీర ప్రాంతంలో ఒక మొసలి ఉండడం గమనించి దాని చెంతకు వెళ్లాడు. ఈ విషయం గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని ఎంత వారించినా ఏమాత్రం లెక్కచేయకుండా తన ప్రాణాలను పణంగా పెట్టాడు. నదీతీర ప్రాంతంలో ఉన్న మొసలి చెంతకు వెళ్లి మొసలితో పరాచకాలాడాడు. మొసలి వీపుపై నిమురుతూ దానితో ముచ్చట్లు పెట్టుకున్నాడు.ఈ సీన్ చూసిన కొందరు స్థానికులు అతనిని వెనక్కి రండీ అంటూ కేకలు పెట్టారు. అయినా వారి మాటలు పట్టించుకోకుండా పంకజ్ మొసలి తో ముచ్చట్లు పెట్టాడు.

ఈ విధంగా పంకజ్ మొసలికి ముచ్చట్లు చెబుతన్నంతసేపు విన్న మొసలి చివరకు అతనిని ఏమీ అనకుండా మెల్లగా నదిలోకి జారుకుంది.అయితే ఈ సంఘటనను అక్కడ కొందరు స్థానికులు వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ముసలి మూడ్ బాగుండడంతో ప్రాణాలతో బయట పడ్డావు అంటూ కొందరు కామెంట్లు పెట్టగా, మరికొందరు మాత్రం మొసలి తో ఆ ముచ్చట్లు ఏంటని తమదైన శైలిలో స్పందించారు. మరికొందరు మాత్రం పంకజ్ ఆ మొసలి పట్ల చూపిన ప్రేమాభిమానాలకు సలాం కొడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -