శ్రీరెడ్డి.. ఈ పేరే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. కాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వచ్చిన ఈ బోల్డ్ బ్యూటీ.. నగ్నంగా నిరసన తెలిపి చిత్రపరిశ్రమలో సంచలనంగా మారింది. ఆ తర్వాత సెలబ్రిటీలపై విరుచుకుపడుతూ.. వార్తలో నిలుస్తుంది. అప్పట్లో పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు చేసి పెను దుమారం లేపింది. ఇలా చిత్ర పరిశ్రమలో పలువురి ప్రముఖులను టార్గెట్ చేయడంతో ఆమె మరింత పాపులర్ అయిపోయింది. ముఖ్యంగా మెగా హీరోలపై ఎక్కువగా విరుచుకుపడుతుంది ఈ బోల్డ్ బ్యూటీ. తాజాగా ఈ సంచలన తార ‘ఆచార్య’ టీజర్ గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘ఆచార్య’ కథ తనకు తెలుసంటూ కథ ఏంటో ఒక్క లైన్లో చెప్పేసింది. ‘చిరంజీవి ఎక్కడి నుండో ఒక ఊరికి వస్తాడు, ఆ ఊర్లో వాళ్ళకి దేవుడిలా వాళ్ళ కష్టాలు తీరుస్తాడు. అంతే” అంటే అని పేర్కొంటూ ఆచార్య టీజర్ జత చేసింది. అంతటితో ఆగకుండా మెగాస్టార్ చిరంజీవి నటనటను కించపరుస్తూ మధ్యలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ను లాక్కొచ్చింది. ”అబ్బే, ఎంతైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి నటన ముందు చిరంజీవి కూడా సరిపోదు. ఆచార్య ట్రైలర్లో డైలాగ్ డెలివరీ అస్సలు బాగోలేదు” అంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఇక ఆచార్య విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ సినిమా ఇది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మిస్తున్నారు. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, ఆయన తనయుడు రామ్చరణ్ సరసన పూజా హెగ్డే నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే విడుదలైన టీజర్లో భారీ స్పందన వస్తోంది. మే 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
పవన్ తో మూవీ.. సాయి పల్లవి పారితోషికం ఎంతో తెలుసా?
బాబోయ్.. అనసూయ డిమాండ్ మాములుగా లేదుగా..