దక్షిణాది అగ్రకథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న గ్లామర్ బ్యూటీ రకుల్ప్రీత్ సింగ్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం ఉంది.తాజాగా తెలుగులో నితిన్ హీరోగా ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన చిత్రం ‘చెక్’. ఇందులో రకుల్ప్రీత్ సింగ్ లాయర్ మానసగా కీలకపాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది.దక్షిణాదిలో అగ్ర కథానాయికగా కొనసాగుతూనే బాలీవుడ్లో అడుగుపెట్టిన రకుల్ అక్కడా క్రేజీ హీరోయిన్ గా సత్తా చాటుతోంది.
రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా బ్రదర్స్ డే సందర్భంగా తన సోదరుడు అమన్ ప్రీత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకున్న ఒక్కగానొక్క తమ్ముడు అమన్కు హ్యాపీ బ్రదర్స్ డే, నా సంతోషం, నా బలం, నా మోగ్లీ అన్నీ నువ్వే లవ్యూ అంటూ రకుల్ ప్రీత్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. తన తమ్ముడితో కలిసి స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ తన సోదరుడి వీపుపై ఎక్కి ఉన్న ఫోటోని షేర్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also read:బాలయ్య పుట్టిన రోజుకు పెద్ద గిఫ్ట్.. ఏంటంటే?
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ తెలుగు ఇండస్ట్రీకి “తెర వెనుక”, “నిన్నే పెళ్లాడతా” అనే సినిమాల ద్వారా హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇక రకుల్ ప్రీత్ సింగ్ విషయానికొస్తే తెలుగులో క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో పలు అగ్రహీరోల సరసన భారీ బడ్జెట్ మూవీల్లో కూడా నటిస్తోంది.
Also read:ఆచార్య నుంచి మరో సర్ ప్రైజ్ రెడీ చేసిన కొరటాల.. పెద్ద ప్లానే?