Thursday, April 25, 2024
- Advertisement -

ఆచార్య నుంచి మరో సర్ ప్రైజ్ రెడీ చేసిన కొరటాల.. పెద్ద ప్లానే?

- Advertisement -

టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవికి ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే.కొంత కాలం పాటు రాజకీయాల్లో బిజీగా ఉన్న మెగాస్టార్ తిరిగి “ఖైదీ నెంబర్ 150” ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత మెగా స్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “సైరా నరసింహారెడ్డి” మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ప్రస్తుతం చిరంజీవి 152 వ సినిమా “ఆచార్య” కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

తాజాగా ‘ఆచార్య’ మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్అభిమానుల కోసం సిద్ధం చేశాడట దర్శకుడు కొరటాల శివ. ఈ మూవీ నుంచి ఇటీవలే రిలీజ్ చేసిన ‘‘లాహే లాహే’’ సాంగ్ అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చి దూసుకుపోతుంది.ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో రొమాంటిక్‌ పాటను సిద్ధం చేసినట్లు సమాచారం. మరి ఈ పాట మెగాస్టార్ చిరంజీవి పై చిత్రీకరించిందా,
లేక రామ్ చరణ్ పై చిత్రీకరించిందా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Also read:మరోసారి రామ్ చరణ్ తో జతకట్టనున్న బాలీవుడ్ భామ?

ఈ మూవీలో రామ్ చరణ్ ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. చరణ్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.చిరంజీవి సరసన కాజల్ నటిస్తోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు మణిశర్మ అద్భుతమైన లిరిక్స్ అందించాడు. ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిన విషయం తెలిసిందే. దాంతో ప్రకటించిన రిలీజ్ డేట్ కూడా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also read:త్రివిక్రమ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -