Tuesday, April 30, 2024
- Advertisement -

రంగం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది?

- Advertisement -

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన “జోష్” సినిమా ద్వారా కార్తీక హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఈమె పూర్తిపేరు కార్తీక నాయర్. అలనాటి స్టార్ హీరోయిన్ రాధ కూతురు కార్తిక. జోష్ మూవీలో కార్తీక స్కూల్ టీచర్ పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత జీవా హీరోగా నటించిన”రంగం” మూవీలో కార్తీక హీరోయిన్ గా నటించిది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో కార్తీక కు హీరోయిన్ గా తమిళ కన్నడ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు దక్కాయి.

అయితే హీరోయిన్ కార్తీకకు అక్కడ తగిన గుర్తింపు రాకపోవడంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన దమ్ము మూవీలో నటించినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో కూడా అవకాశాలు రాలేదనే చెప్పాలి.తర్వాత అల్లరి నరేష్‌ హీరోగా నటించిన బ్రదర్‌ బొమ్మాళి సినిమాలో అద్భుతంగా నటించింది.

Also read:భర్తతో విడిపోయిన విడాకులివ్వలేదు.. ఎందుకంటే?

తర్వాత కొంతకాలానికి బుల్లితెరపై ఆరంభ్‌ అనే హిందీ టీవీ సీరియల్‌లో నటించింది. అయితే హీరోయిన్ కార్తీక కు అదృష్టం వరించకపోవడంతో ఇండస్ట్రీలో అవకాశాలు లేక పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది అని చెప్పాలి. కార్తీక ప్రస్తుతం ప్రముఖ యూడీఎస్‌ హోటల్‌ గ్రూప్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. ఏది ఏమైనా కార్తీకకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉందట.

Also read:ఆట ఫెమ్ గీతిక ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -