Saturday, May 4, 2024
- Advertisement -

అతను ఇచ్చిన రూ.300 ఇంకా నాతోనే ఉన్నాయ్: ప్రియమణి

- Advertisement -

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్,దీపికా పదుకొనె నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ ఎలాంటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2013లో విడుదలైన ఈ సినిమాలోని వన్‌ టూ త్రీ ఫోర్‌.. గెట్‌ ఆన్‌ ది డ్యాన్స్‌ ఫ్లోర్‌.. ఈ ఐటెం సాంగును ఎవరు మర్చిపోరు. ఈ పాటలో షారుక్ సరసన ప్రియమణి ఎంతో అద్భుతంగా నటించారు.

తాజాగా ప్రియమణి ది ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ ద్వారా మరోసారి అందరిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రియమణి ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా చెన్నై ఎక్స్ ప్రెస్ లోని ఈ పాట చిత్రీకరణ సమయంలో జరిగిన కొన్ని సన్నివేశాలను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలోని ఈ పాట ఐదు రోజుల పాటు మహారాష్ర్టలోని వాయి అనే నగరంలో చిత్రీకరించారు.

Also read:ప్యాకెట్ పాలు తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!

ఈ పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో షారుఖ్ ఖాన్ ఐప్యాడ్‌లో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ ఆడుతుంటే రూ.300 ఇచ్చారు. ఆ రోజు అతను ఇచ్చిన రూ.300 లు ఇప్పటికీ నాతోనే ఉన్నాయి. షారుక్ ఎంతో గొప్ప నటుడు అయినప్పటికీ విషయాలను ఎప్పటికీ తలకెక్కించుకుంటున్న షూటింగ్ సమయంలో ఎంతో స్వీట్ గా, అందరితో కలివిడిగా ఉంటూ తన చుట్టూ ఉండే వారందరూ కంఫర్ట్ జోన్ లో ఉండాలని భావిస్తారు.రేపటి షూటింగ్లో భాగంగా ఎలాంటి స్టెప్పులు వేయాలో ముందుగా కొరియోగ్రాఫర్ ని అడిగి వాటిని ముందు రోజు నుంచి ప్రాక్టీస్ చేసేవారని అప్పటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా ప్రియమణి గుర్తు చేసుకున్నారు.

Also read:ఆంధ్ర స్పెషల్.. టమోటా పప్పు ఎలా చెయ్యాలంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -