Tuesday, April 30, 2024
- Advertisement -

సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్.. రిలీజ్ అయ్యేది అప్పుడే?

- Advertisement -

మెగా హీరో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ జంటగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ముందుగా అనుకున్న ప్రకారం జూన్ 4వ తేదీన విడుదల కావలసి ఉంది. అయితే కరోనా కారణం వల్ల ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు సినిమా షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే సాయిధరమ్ రిపబ్లిక్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ క్రమంలోనే హీరో సాయి ధరమ్ తేజ్ డబ్బింగ్ మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వరగా ముగించుకొని త్వరలోనే ఈ సినిమా థియేటర్ లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

Also read:డిన్నర్ రన్ అంటూ చీరకట్టులో పరిగెత్తుతున్న తాప్సి!

గతంలో కరోనా మొదటి దశ తరువాత కేవలం 50 శాతం సీట్ల భర్తీతోథియేటర్లు ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి తెలపడంతో మొట్టమొదటిగా సాయిధరమ్ తేజ్ నటించిన “సోలో బ్రతుకే సో బెటర్” సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు కూడా మరోసారి సాయి ధరంతేజ్ “రిపబ్లిక్” థియేటర్లలో విడుదల అయి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించనున్నారు.

Also read:ఒకప్పటి ఫోటో షేర్ చేసిన వర్మ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -