మొన్నటి వరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలు ఏక పక్షంగా జరుగుతాయని భావించారు అందరూ.. కానీ ఇప్పుడు అది కాస్త రసవత్తరంగా మారిపోయింది. ప్రకాశ్ రాజ్,మంచు విష్ణు,జీవితా రాజశేఖర్ లతో పాటు నిన్న బరిలోకి నటి హేమ కూడా దిగింది. ఈ నేపథ్యంలోనే త్రిముఖ పోరు కాస్తా.. చతుర్ముఖ పోరుగా మారిపోయింది. దాంతో ‘మా’ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి.
ఇక సెప్టెంబర్లో జరగాల్సిన ఎన్నికలకు 3 నెలల ముందే వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలోనే ఈ రోజు ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యుల పేర్లను ప్రకటించారు. ‘మా’ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాత్మక ఆలోచనలతో ‘మా’ ప్రతిష్ఠను నిలబెడతానన్నారు. నటీనటుల బాగు కోసం పనిచేస్తానని చెప్పారు.
ప్రకాశ్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్, తనీష్, ప్రగతి, అనసూయ, సన, అనిత చౌదరి, సుధ,అజయ్, నాగినీడు, బ్రహ్మాజీ, రవిప్రకాష్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేష్ ,ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జన్ , సురేష్ కొండేటి, ఖయ్యుం, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్రావు .
శ్రావణి గానం అద్భుతం.. తప్పకుండా అవకాశం ఇస్తా : దేవిశ్రీ ప్రసాద్
ఫ్రైడ్ రైస్ లో బొద్దింక… రెస్టారెంట్పై నటి నివేదా పేతురాజ్ ఫైర్