తమిళ దర్శకుడు సెల్వరాఘవన్, హీరో ధనుష్ సోదరులు అన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరిదీ హిట్ కాంబినేషన్. సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో ఆడువారి మాటలకు అర్థాలే వేరులే తమిళ వెర్షన్ లో ధనుష్ హీరోగా నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలోనే ధనుష్ కు మంచి ఆరంభం లభించింది. ఇదే సినిమాను సెల్వరాఘవన్ తెలుగులో వెంకటేశ్ హీరో గా ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అనే పేరుతో తెరకెక్కించగా ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది.
కాగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన యుగానికి ఒక్కడు అనే తమిళ సినిమా కూడా సూపర్ హిట్ అవడమే కాకుండా మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. ఈ సినిమాతోనే సూర్య సోదరుడు కార్తీ హీరోగా అరంగేట్రం చేశాడు. కాగా ఈ సినిమా సీక్వెల్ కు ప్రస్తుతం నిర్మాత కలై పులి థాను సీక్వెల్ నిర్మిస్తున్నారు. సీక్వెల్ కు కూడా సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో హీరోగా కార్తీ నటించడం లేదు. ఆ ప్లేస్ లో హీరోగా ధనుష్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘నానే వరువేన్ ‘ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు దర్శకుడు సెల్వరాఘవన్ ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోదరుడికి ఇప్పటికే ఓ హిట్ ఇచ్చిన సెల్వరాఘవన్ మరోసారి ఇంతకంటే పెద్ద హిట్ ఇవ్వాలని కృషి చేస్తున్నట్లు సమాచారం.
Also Read