అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కెరటం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం మంచి పేరు తీసుకు వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన వరుస ఛాన్సులు దక్కించుకుంది. తెలుగులో మహేష్, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ లతో ఆడి పాడింది. ఈ ఏడాది రకుల్ నితిన్ ‘చెక్’మూవీలో నటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగు లో పెద్దగా సక్సెస్ లు కలిసి రాకపోవడంతో బాలీవుడ్ కి పయణం అయ్యింది. ఈ అమ్మడు ఈ మద్య చాలా స్లిమ్ గా మారింది.. తన కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటో షూట్లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్ తన గ్లామర్ పిక్స్ తో ఫ్యాన్స్ కి అప్పుడప్పుడూ ట్రీట్ ఇస్తూ ఉంటుంది.
తాజాగా రకుల్ బికినీలో హాట్ పిక్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ తెలుగులో వైష్ణవ్ తేజ్ కొండపొలంలో నటిస్తోంది దీనికి క్రిష్ దర్శకుడు. అంతేకాదు శివకార్తికేయన్ సరసన తమిళంలో ఓ చిత్రంలో.. మేడే, థాంక్ గాడ్, అటాక్ అనే హిందీ చిత్రాల్లో నటిస్తోంది.
‘సభకు నమస్కారం’ అంటున్న అల్లరి నరేశ్..!