ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. అలా టార్గెట్ చేయడంలో వరుస ఓటములు మాత్రమే కారణం కాదు. దీపావళి విషయంలో సెక్యులర్ కబుర్లు చెప్పడమే దీనికి రీజన్ గా కనిపిస్తుంది. పాకిస్థాన్ తో ఇలాంటి సిరీస్ లలో ఏనాడు అపజయం చూడని భారత్ కు ఈయనగారి నాయకత్వం ఓటమి పాలయ్యేలా చేసింది. అది చాలదన్నట్లు యాంటీ హిందూ సోది కబుర్లు చెప్పడం హార్ట్ కోర్డ్ హిందూస్ కు మండేలా చేసింది.
మ్యాచ్ అనంతరం టాప్ ఆర్డర్ వైఫల్యం గురించి కోహ్లీ మాట్లాడటంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా.. కోహ్లీ స్టేట్మెంట్ ను తూర్పారబట్టాడు.నిజానికి ఓ కెప్టెన్ కు ఉండాల్సిన ప్రధాన లక్షణం సహనం,బ్యాలెన్స్ గా మాట్లాడటం. ఐతే ఇవేవి కోహ్లీకి లేవు.రోహిత్ శర్మ ఎక్కడ తనకు పోటీ వస్తాడోనని లాబీలలో అతన్ని తీసిపారేస్తూ మాట్లాడటం కూడా విరాట్ పై బిగ్ కంప్లెయింట్ గా ఉంది.
ఇది చాలదన్నట్లు దీపావళి విషయంలో క్రాకర్స్ పై తాను వెలిబుచ్చిన అభిప్రాయాన్ని కాషాయదళం సీరియస్ గా తీసుకుంది.మరో మ్యాచ్ ఓడిపోతే ఇంటికొచ్చేసే పరిస్థితులు ఉన్నాయికాబట్టి..దాన్నొక వంకగా తీసుకుని కెప్టెన్ గిరీ పోయే వరకు హార్ట్ కోర్ టీం విరాట్ కు వ్యతిరేకంగా పనిచేయెచ్చు.ఇప్పుడు విరాట్ ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడుతున్నాడో అదే రోహిత్ శర్మకు తన చేతులతోనే కెప్టెన్ గిరి కట్టబెట్టవచ్చు.ఆవేశం అనర్ధాలకు కారణం అనే మాట విరాట్ కెరియర్ నుఏ చూస్తే అర్ధమవుతుంది.
చరిత్ర సృష్టిస్తానంటున్న అనంతపురం అగ్గిబరాటా!!
ఆ ఇద్దరు మినిష్టర్ లపై ట్రోలింగ్..