Thursday, March 28, 2024
- Advertisement -

క్రిప్టో మాయ‌లో ప‌డి యువ‌త ఏం చేస్తున్నారో తెలుసా

- Advertisement -

ఈజీ మ‌నీ ట్రాప్ యువ‌త‌ను అత్యాశ‌కు పోయేలా చేస్తుంది. అలాంటి ఈజీ మ‌నీల‌లో క్రికెట్ బెట్టింగ్ తో పాటు తాజాగా క్రిప్టో కూడా వ‌చ్చి చేరిపోయింది. ఒక్క బిట్ కాయిన్ నేటిత‌రం యువ‌త ఆలోచ‌న‌ల‌ను పూర్తిగా మార్చేస్తుంది.

ఊరు పేరులేని వారు సృష్టించిన బిట్ కాయిన్ 2016లో 54వేలు ఉంది. అప్ప‌ట్లో అంత ఖ‌ర్చు పెట్టి ఒక కాయిన్ కొనాలా అని తెగ ఫీలైపోయిన‌వారంతా ఇప్పుడు అంత‌కుమించి 10రెట్లు ఫీలైపోతూ.. నెత్తినోరు బాదుకుంటున్నారు.దీనికి కార‌ణం బిట్ కాయిన్ 54వేల నుంచి 45ల‌క్ష‌లు చేరుకోవ‌డ‌మే.

తాజాగా షిబా కాయిన్ ఇలాంటి వండ‌ర్స్ నే క్రియేట్ చేస్తుంది. 10రెట్లు పెరిగి మ‌రీ ఈ కాయిన్ ఇప్పుడు అర్ధ పైసా ద‌గ్గ‌ర ట్రేడ్ అవుతుంది. ఈఏడాది డిసెంబ‌ర్ 10 త‌ర్వాత ఒక సెంట్ అన‌గా 77పైస‌ల‌కు వెళ్తుంద‌ని ఎక్స్ ప‌ర్ట్స్ చెబుతున్నారు. అంటే 150రెట్లు అన్న‌మాట‌. ఇందుకోస‌మ‌ని చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ వ‌జీర‌క్స్ ,బినాన్స్ ల‌లో అకౌంట్లు ఓపెన్ చేసి కాయిన్స్ కొనేస్తున్నారు. ప్ర‌స్తుతానికి పేమెంట్ గేట్ వేల‌లో ఇష్యూస్ లేకపోయినా..ఒక‌వేల ట్రాన్ సాక్ష‌న్ కార‌ణంగా… బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయితే ప‌రిస్థితి ఏంటి. ఇప్ప‌టికే చాలామందికి ఇది జ‌రిగింది. ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ ఈవిష‌యంలో క్లారిటీ ఇస్తే గ‌నుక‌ ఎంతోకొంత ఎర్న్ చేసుకోవాలి కాబ‌ట్టి ఇందుల్లో మ‌నం ఇన్వెస్ట్ చేయెచ్చు. లేదంటే లైట్ తీసుకోవ‌డం బెట‌ర్. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి త‌ర్వాత మ‌న ఇండియ‌న్ స్టాక్ మార్కెట్లు స‌పోర్ట్ లెవెల్ కు వ‌స్తాయి కాబ‌ట్టి అప్పుడు ఎంట‌ర్ అవ్వ‌డం క‌రెక్ట్ .

టిఆర్ఎస్ కు ఫ్యూచ‌ర్ క‌నిపిస్తుందా..

టాలీవుడ్ లో విలన్స్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోలు..!

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్…

డ్రాగన్ ఫ్రూట్ తో ఇన్ని లాభాలా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -