తల్లి శ్రీదేవిని గుర్తు తెచ్చుకుంటూ.. ఆమె ముద్దుల తనయ జాన్వీకపూర్ భావోద్వేగ పోస్టు పెట్టింది. అతిలోక సుందరి శ్రీదేవి బాత్ టబ్లో పడి 2018, ఫిబ్రవరి 24న దుబాయ్లో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా సోషల్ మీడియాలో జాన్వీ తన ఆవేదన పంచుకుంది. తన తల్లితో తీసుకున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ‘‘నా జీవితంలో ప్రస్తుతం నువ్వు లేకున్నా.. ఇన్ని సంవత్సరాలు నీ జ్ఞాపకాలతోనే గడిపాను.
నా పక్కన నువ్వు లేకుండానే మరో ఏడాదిలోకి అడుగుపెట్టాను. అందువల్ల ఈ ఏడాదిని కూడా అసహ్యించుకుంటాను. అయితే.. జీవితంలో నేను ఉన్నత శిఖరాలను అధిరోహించి నువ్వు గర్వపడేలా చేస్తానని ఆశిస్తున్నాను. లవ్ యూ అమ్మ’’ అని జాన్వీ కపూర్ పోస్ట్ పెట్టింది. శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ సైతం తన తల్లితో చిన్నప్పుడు తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
’దఢక్’ చిత్రంతో బీ టౌన్లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ… ‘గుంజన్ సక్సేనా’, ‘కార్గిల్ గాళ్’ వంటి సినిమాల్లో నటించి అభిమానులను ఆకట్టుకుంది.
మహేశ్కు విలన్గా విక్రమ్… మ్యాజిక్ చేయబోతున్న త్రివిక్రమ్
దుబాయ్లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్… చీఫ్ గెస్ట్గా హాలీవుడ్ స్టార్ హీరో