కేజీఎఫ్2 రిలీజ్ కు రెడీ అయిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. నాలుగు సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్ 1 మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ సినిమాతోనే యశ్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అయితే ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్న కేసీఎఫ్2 పై భారీ అంచనాలే ఉన్నాయి.
పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ మూవీ కావడంతో అందుకు అనుగుణంగా ఈ సినిమా టికెట్ రెట్లను పెంచుకునే వెసులు బాటు కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఏప్రిల్ 14వ తేది నుంచి 4 రోజుల పాటు టికెట్ రెట్లను పెంచుకోవచ్చంటూ బంఫర్ ఆఫర్ ఇచ్చింది.
ఐమాక్స్, సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ స్క్రీన్లు థియేటర్లు ఒక టికెట్ పై 50 రూపాయల వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏసీ థియేటర్లలలో ఒక్కో టికెట్ పై 30 రూపాయల వరకు పెంచుకోవచ్చని స్పష్టం చేసింది. నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ రెట్లలలో ఎలాంటి మార్పు లేదు. నాలుగు రోజుల పాటు రోజుకు ఐదు షోలు వేసుకోవచ్చని తెలిపింది. కేజీఎఫ్-2 ట్రైలర్కు క్లాస్..మాస్ ఆడియోన్స్ను ఆకట్టుకుంటూ మూవీపై అంచనాలను పెంచుతోంది.