Friday, April 26, 2024
- Advertisement -

అయేషా టాకియాకు చేదు అనుభవం

- Advertisement -

బాలీవుడ్‌ హీరోయిన్‌ అయేషా టాకియాకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టులో ఓ అధికారి అయేషాను అసభ్యంగా తాకాడని.. ఆమె భర్త ఫర్హాన్‌ అజ్మీ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. సొంత దేశంలోనే ఇలా జరగడం అవమానంగా ఉందన్నారు. ఫ్యామిలీతో ‘ఇండిగో 6E 6386’ విమానంలో గోవా నుంచి ముంబైకి ప్రయాణించేందుకు సిద్దమయ్యామని… ఎయిర్‌పోర్టులో ఆర్‌పీ‌సింగ్, ఏకే యాదవ్ అనే ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు తనను, అయేషాను అడ్డగించారని తెలిపారు.

వాళ్ల టీమ్ మెంబర్స్‌ ముందు వెకిలిగా ప్రవర్తించారని.. సెక్యూరిటీ చెక్ కోసం లైన్‌లో నిలబడితే సెక్యూరిటీ డెస్క్‌లోని ఓ పురుష అధికారి తనను, తన ఫ్యామిలీని వేరువేరు లైన్‌లో నిలబడమని సూచించారన్నారు. ఆ సందర్భంలోనే ఆయేషా ఒంటిని ఇష్టం వచ్చిన చోట్ల తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. మహిళలను టచ్ చేయడానికి మీకు ఎంత ధైర్యం, ఆ హక్కు ఎవరిచ్చారని, దూరంగా ఉండాలని చెప్పినట్లు తెలిపారు.

ఈ గొడవ తర్వాత మళ్లీ నన్ను తనిఖీ చేస్తున్నప్పుడు కూడా అసభ్యంగా ప్రవర్తించారన్నారు. ఘటనపై దర్యాప్తు చేసి న్యాయం అందించాలని ట్విటర్ ద్వారా డిమాండ్ చేశారు. స్పందించిన ఎయిర్‌పోర్ట్ అధికారులు క్షమాపణలు కోరారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

చిరు అభిమానులకు ఆచార్య టీం గుడ్‌న్యూస్

ఏప్రిల్ 14న ఆలియా రణ్‌బీర్‌ల వివాహం

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -