అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ – నయనతార జంటగా నటించిన చిత్రం జవాన్. గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షుకుల ముందుకువచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ని షేక్ చేస్తోంది. తొలిరోజే దాదాపు రూ.100 కోట్ల గ్యాస్ సాధించింది. ఇక ఘనత సాధించిన ఏకైక నటుడిగా షారుఖ్ నిలిచాడు. షారుఖ్ రీసెంట్ మూవీ పఠాన్ సైతం తొలిరోజే రూ.100 కోట్లు వసూలు చేసింది. బ్యాక్ టు బ్యాక్ తొలిరోజే వంద కోట్లు వసూలు చేయగా ఇప్పట్లో ఎవరూ షారుఖ్ని బ్రేక్ చేసేలా కనిపించడం లేదు.
మొదటి రోజే ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ. 75 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇదే కొనసాగితే ఫుల్ రన్లో జవాన్ రూ.1000 కోట్లు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇదేగనక జరిగితే బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు వసూలు చేయడం షారుఖ్కి ఇది రెండోసారి అవుతుంది. పఠాన్ కూడా వెయ్యికోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.
షారూఖ్ ఖాన్ నటన, అట్లీ దర్శకత్వం సినిమాకు ప్లస్గా మారింది. ఇక తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్ గూస్ బంప్స్. స్క్రీన్ప్లే, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు, బీజీఎం, క్లైమాక్స్, మాస్ ఎలివేషన్లు ఆకట్టుకున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా జవాన్ సక్సెస్ ఫుల్గా రన్ అవుతున్న బంగ్లాదేశ్లో మాత్రం అక్కడి సెన్సార్ బోర్డు నిషేధించింది.