బాక్సాఫీస్ వద్ద సరికొత్త యుద్ధానికి రంగం సిద్ధమైంది.క్రిస్మస్ వార్లో ప్రభాస్ వర్సెస్ షారుఖ్గా వార్ కన్ఫామ్ అయింది. తొలుత ప్రభాస్ సలార్ విడుదల తేదీ ఖరారు కాగా షారుఖ్ సినిమా డంకీ కూడా రిలీజ్కు సిద్ధంగా ఉంది. అయితే ఈ వార్ నుండి షారుఖ్ తప్పుకుంటారని ప్రచారం జరిగిన ఎట్టకేలకు డంకీ రిలీజ్ ఖరారైంది.
సలార్ కంటే ఒకరోజు ముందుగా డంకీ డిసెంబర్ 21 రిలీజ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ అఫిషియల్గా ప్రకటించగా రాజు హిరానీ తెరకెక్కించారు. ఇప్పటికే పఠాన్,జవాన్ వెయ్యికోట్ల బిజినెస్ చేయగా డంకీపై భారీ ఆశలు ఉన్నాయి.
ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ రెండు పార్టులుగా రిలీజ్ కానుంది. డిసెంబర్ 22న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా కేజీఎఫ్ తర్వాత నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ రెండు సినిమాలపై అంచనాలు ఎలా ఉన్నా ఇద్దరు అగ్రహీరోలు బాక్సాఫీస్ ముందు తలపడుతుండటంతో ఎవరు పైచేయి సాధిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.