టాలీవుడ్ యూత్ ఐకాన్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనత సాధించనున్నాడు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి సొంతంకాని జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకున్నారు బన్నీ. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను ఈ అవార్డు దక్కగా తాజాగా ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్లో అడుగుపెట్టనున్నారు బన్నీ.
లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారట. త్వరలోనే అల్లు అర్జున్ ఈ విగ్రహం కోసం కొలతలు ఇవ్వడానికి లండన్ వెళ్లనున్నారని తెలుస్తోంది. అయితే ఈ న్యూస్లో నిజం ఉందో లేదో తెలియదుకానీ బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి మాత్రం అవధుల్లేకుండా పోయాయి.
సోషల్ మీడియాలో ఈ న్యూస్ని తెగ ట్రెండ్ చేస్తున్నారు. మేడమ్ టుస్సాడ్స్లో కొలువుదీరిన వారిలో బాలీవుడ్ నుండి అమితాబ్, హృతిక్, ఐశ్వర్య, షారుక్, మాధురి దీక్షిత్ ఉండగా టాలీవుడ్ నుండి కేవలం మహేష్, ప్రభాస్,కోలీవుడ్ నుండి బాహుబలి కట్టప్ప సత్యరాజ్ మాత్రమే ఉన్నారు. తాజాగా బన్నీ మైనపు విగ్రహాం కొలువుదీరితే సౌత్ నుండి ఈ ఘనత సాధించిన మరో నటుడిగా నిలవనున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప గ్రాండ్ సక్సెస్ కావడంతో దీని సీక్వెల్ పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందరి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా తెరకెకిస్తున్నారు సుక్కు. 2024 ఆగస్టు 15న పుష్ప 2 గ్రాండ్గా రిలీజ్ కానుంది.