ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం హనుమాన్.సంక్రాంతి రేసులో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రాగా అద్భుతమైన డైలాగ్స్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్,హనుమంతుడిని ఎలివేట్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తేజ సజ్జ, వరలక్ష్మి శరత్కుమార్, అమృత అయ్యర్ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. రామ భక్తుడు హనుమంతుడి వల్ల ఓ కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే ఆ కథ ఎలా ఉంటుందో ప్రశాంత్ వర్మ చాలా అద్భుతంగా చూపించారు.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేయగా సినిమా ఎండింగ్లో ఇందుకు సంబంధించిన టైటిల్ని రివీల్ చేశారు. బాహుబలి లెవల్లో సెకండ్ పార్ట్పై అంచనాలను పెంచేశారు. హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటనే ట్విస్ట్ నేపథ్యంలో సీక్వెల్ సాగనుండగా దీనికి జై హనుమాన్ అనే టైటిల్ ని ఖరారు చేశారు.
వచ్చే ఏడాది 2025లో సినిమా రిలీజ్ కానుంది. ఇక హనుమాన్ పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ప్రధానంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ , చాలా సీన్స్ ఆడియన్స్ కి గూస్బంప్స్ తెప్పిస్తాయని సినిమా చూసిన వారు చెబుతున్నారు. మొత్తంగా సంక్రాంతి రేసులో హిట్ కొట్టారు తేజ సజ్జా.