Saturday, May 18, 2024
- Advertisement -

దర్శకుడికి రాఖీ కట్టిన హీరోయిన్!

- Advertisement -

రవితేజ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ఈగల్. రీసెంట్‌గా టైగర్ నాగేశ్వరరావుతో మెప్పించిన రవితేజ తాజాగా ఈగల్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగగా ఈ వేడుకలో అనుపమ చేసిన పని అందరిని షాక్‌కు గురిచేసింది.

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనిని రాఖీ కట్టారు అనుపమ. అయితే కార్తీక్‌కు అనుపమకు మంచి సంబంధాలున్నాయి. ఎప్పుడు అన్నయ్య అనే ఆయన్ని పిలుస్తుంటుంది. అయితే స్టేజీపై ఒక్కసారిగా రాఖీ కట్టడంతో అంతా షాక్‌కు గురయ్యారు. గతంలో వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాలకు పనిచేయగా మంచి బంధం ఏర్పడింది.

ఇక అనుపమ చేసిన పనిపై స్పందించారు రవితేజ. అందమైన అమ్మాయిలు అన్నయ్య అని పిలువొద్దు అంటూ చమత్కరించారు. ఇక ఇప్పుడు రవితేజ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రేక్షకుల ముందుకురానుండగా ఈగల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -