Thursday, May 16, 2024
- Advertisement -

ఉత్కంఠపోరులో హైదరాబాద్ గెలుపు

- Advertisement -

ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా ఉత్కంఠపోరులో హైదరాబాద్‌ విజయం సాధించింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది సన్‌రైజర్స్. హైదరాబాద్ విధించిన 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 180 పరుగులు చేసింది. శిఖర్ దావన్ 14,సామ్ కర్రాన్ 29,సికిందర్ రజా 28,శశాంక్ సింగ్ 46,జితేశ్ శర్మ 19,అశుతోష్ శర్మ 33 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 2,కమ్మిన్ ,నటరాజన్,నితీశ్ రెడ్డి,ఉనద్కత్ తలో ఒక వికెట్ తీశారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 9 వికెట్లు కొల్పోయి 182 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టిన నితీశ్ కుమార్ 64 పరుగులతో రాణించాడు. దీంతో సన్ రైజర్స్ భారీ స్కోరు సాధించగలిగింది.

ఇక ఇవాళ గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. వరుస విజయాలతో రాజస్థాన్ టాప్ ప్లేస్ లో ఉండగా ఇవాళ జరిగే ఆసక్తికర మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -