తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులకు కొదువలేదు.పిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడంపై పార్టీనే నమ్ముకొని ఉన్న నేతలు అధిస్టానంపై గుర్రుగా ఉన్నారు.ఇక అసెంబ్లీ నియేజక వర్గాలు పెరగవు కాబట్టి సీటు వచ్చే అవకాశంలేని నాయకులంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.
ఇన్నాల్లు పార్టీ మారితే బాబునుంచి ఇబ్బందులు తప్పవని భావించిన నాయకులు ఇప్పుడు శిల్పామోహన్రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఇతర పార్టీలలోకి జంప్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నారు.
{loadmodule mod_custom,GA1}
వివిధ కారణాల వల్ల చంద్రబాబునాయుడుపై అసంతృప్తితో ఉన్న నేతలు ఏ పార్టీలోకి వెళ్ళాలో తేల్చుకోలేక ఇంతకాలం సతమతమవుతున్నారు. అటువంటి వారిలో అత్యధికుల వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఫిరాయింపు ఎంఎల్ఏలున్న 21 నియోజకవర్గాల్లోని టిడిపి అసంతృప్తులే ఎక్కువ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఎన్నికలకు రెండు సంవత్సరాలు టైం ఉన్నా ఇప్పటినుంచే ఎవరిదారి వారు చూసుకుంటున్నారు.ఇన్నాల్లు భయంతో ఉన్న జంప్జిలానీలకు శిల్పా మార్గదర్శనం చేసారు. నంద్యాల టిక్కెట్టు విషయంలో చంద్రబాబు ధోరణి నచ్చకే శిల్పాకు టిడిపికి గుడ్ బై చెప్పేసారు. పార్టీ మారితే తనపై వేధింపులుంటాయని తెలిసే తాను పార్టీ మారినట్లు స్పష్టం చేసారు. అన్నింటికీ ఎదుర్కోవటానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పారు.
టిడిపిలో అసంతృప్తులకు కొదవ లేదు. ఒక్క ఫిరాయింపు ఎంఎల్ఏల నియోజకవర్గాలే కాకుండా చాలా చోట్ల ఇదే పరిస్ధితి. ఒకవైపు ఎన్నికలేమో దగ్గరకు వస్తున్నాయ్. ఇంకోవైపు చంద్రబాబు ఎవరికి టిక్కెట్టు ఇస్తారో కూడా తెలీదు. ప్రతీ విషయంలోనూ నాన్చుడు వ్యవహారమే. దాంతో నేతలు కూడా బాగా విసిగిపోయున్నారు. కానీ ఏం చేయలేకున్నారు.
{loadmodule mod_custom,GA2}
పలు నియోజవకర్గాల్లోని టిడిపి నేతలు ఎన్నికల ముందు తేల్చుకుందామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఒకవైపు జగన్ ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో టిక్కెట్లను ఖరారు చేసేస్తున్నట్లు సమాచారం. అటువంటి వారికి శిల్పా మోడల్ గా నిలిచారు. ఇదే విషయమై శిల్పా మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో చాలామంది నేతలు టిడిపిని వదిలేందుకు సిద్ధంగా ఉన్నారని చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.ఇప్పటినుంచైనా చంద్రబాబు గోడమీద రాజకీయాలు మాని అసంతృప్తులపై దృష్టి సారిస్తే మంచిది లేకుంటే….అదోగతే….
{loadmodule mod_sp_social,Follow Us}
Related
- నంద్యాల టీడీపీ ఖాలీ…. బాబు నాన్చుడు ధోరని కారనమా..?
- వారిద్దరి దూకుడు భవిష్యత్తులో వైసీపీకి ఇబ్బందిగా మారుతుందా….?
- రాయలసీమలో వైసీపీలోకి 5వేల మంది యువకులు
- వైసీపీ వచ్చే ఎన్నికల్లో సింగిల్గా మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తుంది….
{youtube}E3VTxtbzSjY{/youtube}