వెస్టిండీస్తో జరిగిన మూడో, చివరి టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓటమి పాలైనా..కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ మాత్రం చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్తో ఆయన ఫాఫ్ డుప్లెసిస్ను దాటుకుని, దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక టీ20 అంతర్జాతీయ మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన ఆటగాడిగా నిలిచాడు.
వర్షం కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 10 ఓవర్లలో 114 పరుగులు చేసింది. డక్వర్త్–లూయిస్–స్టెర్న్ (DLS) పద్ధతిలో దక్షిణాఫ్రికాకు 125 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే ప్రోటియాస్ 118 పరుగులకే పరిమితమవడంతో వెస్ట్ ఇండీస్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్ ఐడెన్ మార్క్రామ్కు ప్రత్యేకంగా నిలిచింది. ఇది ఆయనకు దక్షిణాఫ్రికా టీ20 కెప్టెన్గా 38వ మ్యాచ్. దీంతో 37 మ్యాచ్లకు కెప్టెన్గా ఉన్న ఫాఫ్ డుప్లెసిస్ను ఆయన అధిగమించాడు. ఇప్పటివరకు మార్క్రామ్ నాయకత్వంలో దక్షిణాఫ్రికా 17 విజయాలు సాధించగా, 21 మ్యాచ్ల్లో ఓటమి ఎదురైంది.
మ్యాచ్ అనంతరం మార్క్రామ్ మాట్లాడుతూ, వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లు చాలా క్లిష్టంగా మారతాయని తెలిపారు. “పవర్ప్లేకు ఐదు ఓవర్లు, డెత్ ఓవర్లకు ఐదు ఓవర్లు మాత్రమే ఉండటంతో ఆట కాస్త కష్టమవుతుంది. మేము గెలుస్తామనే నమ్మకం ఉంది కానీ చివర్లో తడబడ్డాం. అయినప్పటికీ ఈ సిరీస్ నుంచి చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. వరల్డ్కప్కు ముందు ఇది మంచి సూచన” అని మార్క్రామ్ వ్యాఖ్యానించాడు.
