రాయలసీమ ప్రాంతంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరశింహారెడ్డి పాత్రలో చిరంజీవి 151 వచిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకు సైరా నరశింహారెడ్డి అని పెట్టారు. ఇప్పటివరకు పోస్టర్ మాత్రమే విడుదలయ్యింది. అయితె రెగ్యూలర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఎప్పుడెప్పుడు మొదలు పెడ్తారాని అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ఈసినిమాపై అబిమానులకు రోజురోజుకి భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు రిలీజ్ అవుతుందాని ఎదురుచూస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు డిసెంబర్ 6ను షూటింగ్ డేట్ గా చిత్ర బృందం ఫిక్స్ చేసినట్టు సమాచారం .డిసెంబర్ లో షూటింగ్ ఈ నెలాఖరు వరకు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటిని పూర్తి చేసి ఎలాగైన డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించాలని యూనిట్ ప్లాన్ గా తెలుస్తుంది.
బ్రిటీష్ పాలకులకు వ్యతిరేఖంగా పోరాడిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.
డిసెంబర్ 6 నుంచి ఈ పిక్చర్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటోంది. నయనతార హీరోయిన్ రోల్ శాండల్ వుడ్ హీరో సుదీప్.. కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కూడా ఇందులో నటించనున్నారు. నయనతార హీరోయిన్ రోల్ చేస్తోంది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దీనికి సంబంధించి ఏర్పాట్లలో ఉన్నాడని యూనిట్ సభ్యులు తెలిపారు.