- చరణ్తో రకుల్ మూడోసారి
- బోయపాటి దర్శకత్వంలో మూడో సినిమా
పరేషాను రా అంటూ కుర్రాళ్లలో వేడి పుట్టించిన భామ రకుల్ప్రీత్సింగ్. ఈ సినిమాకు అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడుతున్నాయి. వరుస హిట్లతో కూడా దూసుకెళ్తోంది. చిన్న సినిమాలతో వచ్చి ఇప్పుడు భారీ సినిమాలతో బిజీబిజీ అయిపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మెగా హీరో రామ్చరణ్తేజ్తో ఆడిపాడనుంది.
బ్రూస్ లీ సినిమాతో రామ్చరణ్తో జతకట్టిన రకుల్ తర్వాత ధృవలో కలిసి నటించింది. ఆ సినిమాలో అందచందాలు ఆరబోసి రొమాన్స్ పండించింది. ఇప్పుడీ ఇద్దరి కాంబినేషన్లో బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పనులు ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి.
అయితే దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ సినిమాల్లో కూడా రకుల్ప్రీత్సింగ్కు మూడో సినిమా ఇది కాబోతోంది. అల్లు అర్జున్తో తీసిన సరైనోడు, ఇంకా జయ జానకి నాయక సినిమాల్లో రకుల్ప్రీత్సింగ్ నటించింది. ఈ విధంగా దర్శకుడు, హీరోతో రకుల్కు మూడో సినిమా కావడం విశేషం. ప్రస్తుతం రాంచరణ్ రంగస్థలం, సైరా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు పూర్తయిన తర్వాత బోయపాటి సినిమాను పూర్తి చేయనున్నారు. అయితే రకుల్తో ఈ సినిమా కన్ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది. కన్ఫార్మైతే మళ్లీ ఇద్దరు జోడీ ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.
https://www.youtube.com/watch?v=9ghse-cqTvA