- Advertisement -
ఎయిర్టెల్ తమ కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మేరా పెహలా స్మార్ట్ఫోన్ ఆఫర్ను శుక్రవారం లాంచ్ చేసింది. ఇందులో భాగంగా 2జీ లేదా 3జీ ఫోన్లు వాడుతున్న ఎయిర్టెల్ కస్టమర్లు 4జీ స్మార్ట్ఫోన్కు స్విచ్ అయితే 30 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనుంది. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ కస్టమర్లకు వర్తిస్తుంది.
ఈ ఆఫర్కు మీరు అర్హులా కాదా తెలుసుకోవడానికి మీ ఎయిర్టెల్ నంబర్ నుంచి 51111కు కాల్ చేయండి లేదా మైఎయిర్టెల్ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అర్హులైన కస్టమర్లకు 24 గంటల్లోపు ఫ్రీడేటాను యాక్టివేట్ చేస్తారు
ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగాదారులైతే రోజుకి 1జీబీ చొప్పున 30 రోజులకు 30 జీబీ రానుండగా, ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ వినియోగదారులకు ఒకేసారి 30 జీబీ డేటా ఉచితంగా రానుంది.