హీరోయిన్ నివేత థామస్ చేసింది నాలుగైదు సినిమాలే కాని మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.నాని హీరోగా వచ్చిన జెంటిల్మెన్ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది నివేత.ఈ సినిమాలో నివేత నటనకు మంచి పేరు వచ్చింది.తరువాత నిన్ను కోరి ,ఎన్టీఆర్ జైలవ కుశ సినిమాలలో హీరోయిన్గా నటించింది. అయితే నివేతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నివేత థామస్ ఓ కుర్ర హీరో పక్కన సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
విభిన్న కథలు చేస్తు తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న శ్రీవిష్ణు పక్కన హీరోయిన్గా నివేత నటిస్తుందని సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం.మెంటల్ మదిలో సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇటీవల నివేత థామస్ కు కథ వినిపించాడట. కథ నచ్చడంతో సినిమా చేయడానికి నివేత ఒప్పుకుందని సమాచారం.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తారని తెలుస్తుంది.