- Advertisement -
రాజ్ తరుణ్ .. హెబ్బా పటేల్ జంట యూత్కి బాగా కనెక్ట్ అయింది.ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘కుమారి 21F’ .. ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాలు విజయాలను అందుకున్నాయి. ‘అంధగాడుస సినిమా మాత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.అయితే మరోసారి ఈ జంట కలిసి నటించనుందని సమాచారం.తమిళంలో వచ్చిన ‘నానుమ్ రౌడీ దాన్’ మూవీకి రీమేక్లో వీరిద్దరు నటిస్తున్నారు.
విజయ్ సేతుపతి .. నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన నానుమ్ రౌడీ దాన్ తమిళంలో మంచి హిట్ సాధించింది.ఈ సినిమాకు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు.అలాంటి ఈ సినిమాను నిర్మాత సి.కల్యాణ్ తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. కొంతకాలంగా సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్కు ఈ సినిమా అయిన హిట్ ఇస్తుంది ఏమో చూడాలి.