కికి చాలెంజ్ ఎంత ఫేమస్ అయిందో,అంతకన్నా ఎక్కువ వివాదం కూడా అయింది.కదులుతున్న కారులో నుంచి బయటికి వచ్చి డ్యాన్స్ చేసి మళ్లీ తిరిగి కారులో కుర్చోవాలి.ఎవరికి వారు ఈ మొత్తన్ని వీడియో తీసి తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయండంతో,ప్రపంచవ్యాప్తంగా కీకీ చాలెంజ్ ఫేమస్ అయింది.దీనిని మన టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చేశారు.టాలీవుడ్కు చెందిన ఆదా శర్మ, రెజీనాలు కీకీ చాలెంజ్ను స్వీకరించారు.
పోలీసులు ఈ చాలెంజ్ను నిషేదించడంతో కొంతవరకు దీని హవా తగ్గింది. అయితే తాజాగా కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి ఈ కీకీ చాలెంజ్ను వెరైటీగా ప్రయత్నించారు. కదిలే కారులోంచి కాకుండా.. వీల్ చైర్లోంచి దిగి విభిన్నంగా చేశారు. మధ్యలో ఈ కీకీ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి తేజ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు.